అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిల బెయిల్ ను రద్దు చేయాలంటూ నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక వీరిద్దరికి సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో సీబీఐ న్యాయస్థానం ఇచ్చిన షరతులను తుంగలో తొక్కుతున్నారంటూ రఘురామ తరుపు లాయర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
ఇక జగన్ తరపు లాయర్ మేము ఎలాంటి షరతులను ఉల్లఘించలేదని కావాలనే వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసమే ఇదంత డ్రామా అంటూ వాదనలు వినిపించారు. ఇక ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం రఘురామ పిటిషన్ ను కొట్టేసింది. దీంతో గత కొంత కాలం నుంచి రఘురామకృష్ణరాజు అధికార పార్టీపై, ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న విషయం తెలిసిందే.