గత కొన్ని రోజులుగా ఏపీలో జరుగుతున్న పరిణామాలను చూస్తే.. ముందస్తు ఎన్నికలు తథ్యం అనే మాట బలంగా వినిపిస్తోంది. సీఎం జగన్ కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి నిర్ణయించుకున్నారని ఆ మేరకు అడుగులు వేస్తున్నారని.. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయాలే ఇందుకు నిదర్శనం అని జోరుగా ప్రచారం సాగుతోంది. మరీ ముఖ్యంగా గౌతమ్ సవాంగ్ ని డీజీపీ పదవీ నుంచి తొలగించి.. ఆ ప్లేస్ లో కొత్త బాస్ రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించిన నాటి నుంచే.. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే వైసీపీ ఆ దిశగా వ్యూహాలు రచిస్తోందని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి : గల్లా జయదేవ్ పై చంద్రబాబు సీరియస్! కారణం?
టీడీపీ కూడా ముందస్తు ఎన్నికలు రావచ్చని భావించడమే కాక.. ఆ మేరకు సిద్ధం అవుతోందట. ఈ క్రమంలో తాజాగా పార్టీ కార్యకర్తలు, సీనియర్ నేతల నుంచి ఓ ప్రతిపాదన వినిపిస్తోంది. ఏపీలో టీడీపీ మళ్లీ అధికారంలోకి రావాలంటే.. నందమూరి, నారా కుటుంబాలు రెండు క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారు. మరీ ముఖ్యంగా నారా కుటుంబం నుంచి చంద్రబాబు నాయుడు, లోకేష్ తో పాటు నారా బ్రహ్మణి కూడా రాజకీయాల్లోకి రావాలని.. కేడర్ ను నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయట.
నారా బ్రహ్మణి రావాల్సిందే..
నందమూరి, నారా కుటుంబాల ఆడపడుచు బ్రహ్మణి.. పాదయాత్ర చేస్తే టీడీపీ ఎంతో కలిసి వస్తుందని కార్యకర్తలు భావిస్తున్నారట. ఇప్పటికే ఈ ఫార్ములా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విజయవంతం అయ్యిందని.. ఇటు వైఎస్ కుటుంబాన్ని.. అటు తెలంగాణ కేసీఆర్ కుటుంబాన్ని ఉదాహరణగా చూపుతున్నారు కార్యకర్తలు. పైగా కాంగ్రెస్ లో కూడా మిగతా సమయాల్లో ఎలా ఉన్నా.. ఎన్నికల వేళ మాత్రం ప్రియాంక గాంధీ పార్టీ కోసం రంగంలోకి దిగి ప్రచారంలో పాల్గొంటారు. అలానే ఏపీలో కూడా టీడీపీకి మునుపటి వైభవాన్ని తీసుకురావడం కోసం నారా బ్రహ్మణి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని.. పాదయాత్ర చేయాలనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఓ ప్రముఖ టీవీ చానెల్ డిబెట్ లో ఓ విశ్లేషకుడు కూడా ప్రస్తావించాడు.
ఇది కూడా చదవండి : మంత్రి పదవి కోసం రోజా మాస్టర్ ప్లాన్! జగన్ కే చెమటలు!
కార్యకర్తల కోరిక మేరకు నారా బ్రహ్మణి కనుక పాద యాత్ర చేపడితే.. అది టీడీపీకి చాలా ఉపయోగపడుతుందని.. జనాల్లోకి పార్టీని మరింతగా ముందుకు తీసుకెళ్లడానికి వీలవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కార్యకర్తల కోరిక మేరకు నారా బ్రహ్మణి రాజకీయాల్లోకి వచ్చి.. పాదయాత్ర ప్రారంభిస్తే.. ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారతాయంటున్నారు. మరీ కార్యకర్తల కోరిక తీరుతుందో లేదా చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.