రాజకీయ నేతల మధ్య పార్టీల పరంగా విబేధాలు ఉండవచ్చు. వ్యక్తిగతంగా మాత్రం వారి మధ్య మంచి సంబంధాలే ఉంటాయి. తెర మీద మాత్రమే పత్రిపక్ష, అధికార పార్టీ నేతలు అని ఉంటారు. కానీ వ్యక్తిగత జీవితంలో.. మాత్రం.. అందరూ మిత్రులగానే వ్యవహిరస్తారు. ప్రైవేట్ కార్యక్రమాలు, ఫంక్షన్లలో కలిస్తే.. ఆత్మీయంగా పలకరించుకుంటారు. తాజాగా ఇదే సన్నివేశం చోటు చేసుకుంది. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్తో.. గుంటూరు టీడీపీ ఎంపీ, అమరరాజా గ్రూపు సంస్థల సీఎండీ గల్లా జయదేవ్ భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. వీరిద్దరూ కలిసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే వీరిద్దరు ఎక్కడ కలిశారు.. ఎందుకు.. అంటే..
దావోస్లో ప్రస్తుతం వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోఈ కార్యక్రమంలో పాల్గొన్న గల్లా జయదేవ్, మంత్రి కేటీఆర్ని కలిశారు. తెలంగాణలో పెట్టుబడులు, పారిశ్రామిక విధానంపై ఇరువురు చర్చించుకున్నారు. గతంలో తెలంగాణ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు మహబూబ్నగర్ జిల్లాలో రూ.9500 కోట్లతో చేపట్టిన లిథియం అయాన్ గిగా ఫ్యాక్టరీ గురించి కేటీఆర్కు గల్లా జయదేవ్ వివరించారు. ఇక తెలంగాణలో పెట్టుబడులు పెట్టినందుకుగాను ఈ సందర్భంగా గల్లాను కేటీఆర్ ప్రశంసించారు.
దావోస్లో మంత్రి కేటీఆర్తో దిగిన ఫొటోలను గల్లా జయదేవ్ తన ట్విట్టర్లో పంచుకున్నారు. దావోస్లో కేటీఆర్ను కలిశానని, తెలంగాణలో అమర్రాజా సంస్థ ఏర్పాటు చేస్తున్న లిథియం అయాన్ గిగా ఫెసిలిటీ గురించి వివరించినట్లు తెలిపారు. ఇక గల్లా జయదేవ్ ట్వీట్పై మంత్రి కేటీఆర్ స్పందించారు. తన ఔత్సాహిక స్నేహితుడితో భేటీ.. ఎల్లప్పుడు ఆనందదాయకంగా ఉంటుందంటూ కేటీఆర్ కామెంట్ చేశారు. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.
Always good catching up with my enterprising friend @JayGalla https://t.co/S303kMdagI
— KTR (@KTRTRS) January 20, 2023