ఈ మధ్యకాలంలో సినీ పరిశ్రమల్లో పెళ్లిల్ల గోలతో సినీ ప్రముఖులు రచ్చకెక్కుతున్నారు. మొదటగా పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత భార్యకు విడాకులివ్వడం తర్వాత మరో వివాహం చేసుకోవడం. ఉన్నత కుటుంబాల్లో ఎక్కువగా ఇలాంటివి కనిపిస్తుంటాయి. అయితే ఇప్పుడు ఇదే వ్యవహారం రాజకీయ నాయకుల్లో కూడా వినిపిస్తుండడం విశేషం. తాజాగా ఓ ముఖ్యమంత్రి రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. అసలు ఎవరా ముఖ్యమంత్రి అనే కదా మీ ప్రశ్న. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రెండో పెళ్లికి సిద్దమయ్యాడు.
ఇది కూడా చదవండి: సీఎం జగన్ పెట్టుకున్న బ్రాండెట్ వాచ్ గురించి తెలిస్తే.. ఔరా అంటారు!
డా.గురుప్రీత్ కౌర్ తో ఈ ముఖ్యమంత్రి ఛండీగఢ్ లో గురువారం ఘనంగా పెళ్లి చేసుకోబోతున్నాడు. వీరి పెళ్లికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆ రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పలువురు హాజరుకానున్నారు. అయితే భగవంత్ మాన్ మొదటి భార్య ఇంద్రప్రీత్ ను చేసుకున్నాక వీరి ఇద్దరు పిల్లలు జన్మించారు. వీరు ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారట. ఇదిలా ఉంటే సీఎం భగవంత్ ఏదో కారణంతో మొదటి భార్యకు విడాకులిచ్చాడు. దీంతో గురువారం మరోసారి పెళ్లిపీటలు ఎక్కి రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పుడు ఇదే అంశం పంజాబ్ లో తీవ్రచర్చనయాంశమవుతోంది. ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.