ఏపీలో సినిమా టికెట్ల ధరల వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఇండస్ట్రీ పెద్దలతో భేటీ అయ్యింది. పలు దఫాల చర్చల అనంతరం ఫిబ్రవరి 24న జీఓ విడుదల కావాల్సి ఉంది. అయితే మంత్రి గౌతమ్ రెడ్డి మృతితో జీఓ విడుదల ఆలస్యం అయ్యింది. ఫిబ్రవరి 25న పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ సినిమా విడుదల అయ్యింది. అయితే పవన్ మీద కక్షతోనే సినిమా విడుదలకు ముందు రోజు విడుదల చేయాల్సిన జీఓను ఆపేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విమర్శలపై మంత్రి పేర్ని నాని స్పందించారు. పవన్ సినిమాను తొక్కే అవసరం తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ‘‘ఫిబ్రవరి 24వ తేదీన జీఓ రావాల్సి ఉంది.. కానీ మంత్రి గౌతమ్ రెడ్డి మృతితో ఆలస్యమైంది. ఈ విషయం తెలిసి కూడా చంద్రబాబు, లోకేష్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. సినిమాలను కూడా చంద్రబాబు, లోకోష్ వారి రాజకీయాలకు వాడుకుంటున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ బ్లాక్ టికెట్ల అమ్మకాలను ప్రోత్సాహిస్తున్నాయి. ప్రభుత్వం తరఫున మేం దాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నాం. గౌతమ్ రెడ్డి మృతి వల్ల ప్రీ రిలీజ్ వేడుక ఓ రోజు వాయిదా వేశారు.. అలానే సినిమా విడుదలను కూడా రెండు, మూడు రోజులు వాయిదా వేయాల్సింది’’ అన్నారు పేర్ని నాని.
ఇది కూడా చదవండి : వీడియో: థియేటర్ వద్ద పవన్ ఫ్యాన్స్ కు పోలీస్ వార్నింగ్
‘‘నీతులు చెప్పే ఓ హీరో నీతిమాలిన పనులు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ సినిమాను తొక్కేస్తున్నామని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ఓ సినిమా కోసం తండ్రి కొడుకులు పిల్లి మొగ్గలు వేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాను ఒక్కసారైనా ప్రోత్సాహించారా. హైకోర్టు తీర్పు అన్నా, ప్రభుత్వం అన్నా విపక్ష నేతలకు లెక్కలేదు. పవన్ కల్యాణ్ తన సినిమాను ఫ్రీగా వేస్తామన్నారు కదా. సినిమా బాగుంటే.. ఎవరి సినిమాకైనా వెళ్తారు కదా’’ అని ప్రశ్నించారు. పేర్ని నానిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయానలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.