టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 57వ రోజుకి చేరుకుంది. 57వ రోజు పాదయాత్ర ధర్మవరం నియోజకవర్గంలోని ప్యాదిండి విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 57వ రోజుకి చేరుకుంది. 57వ రోజు పాదయాత్ర అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని ప్యాదిండి విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. యువగళం పాదయాత్రలో లోకేశ్ ప్రతీ రోజు సుమారుగా 1000 మందికి సెల్ఫీలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విడిది కేంద్రం వద్ద ప్రతిరోజు తనని కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తల్ని లోకేశ్ కలిశారు. ప్యాదిండి విడిది కేంద్రం వద్ద తనను కలవడానికి వచ్చిన యువతీ, యువకులు, అభిమానులతో లోకేష్ కాసేపు ముచ్చటించారు. తన కోసం వచ్చిన అందరితో లోకేశ్ ఓపికగా సెల్ఫీ దిగడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. లోకేశ్ యువగళం పాదయాత్రలో జనం పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. అలానే యువనేతకు తమ మద్దతు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా కంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో లోకేశ్ పాదయాత్రకు భారీ స్పందన కనిపిస్తోంది. ప్రస్తుతం అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది. నారా లోకేష్ యువగళంలో భాగంగా 11 గంటలకు ప్యాదిండి విడిదికేంద్రంలో పట్టు కార్మికులు, వ్యాపారులతో సమావేశమయ్యారు. అనంతరం 12 గంటలకు విడిదికేంద్రం నుంచి పాదయాత్రను లోకేశ్ ప్రారంభించారు.
అలానే నామాల క్రాస్ వద్ద ఆత్మకూరు రోజూవారి కూలీలతో లోకేశ్ భేటీ అయి..వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాదయాత్రలో భాగంగా ఎర్రగుంటకి చేరుకున్న లోకేశ్ స్థానిక గ్రామల ప్రజలతో మాట్లాడారు. ధర్మవరంలోని టిడ్కో గృహాల బాధితులు, బలిజ సామాజిక వర్గాల వారితో సమావేశమై.. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలానే ముస్లిం పెద్దలతో సమావేశం నిర్వహించారు. చివరగా ఆర్యవైశ్యులతో లోకేశ్ భేటీ అయి..సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగతూ లోకేశ్ తన పాదయాత్రను కొనసాగించారు. నేడు ధర్మవరంలోని సీబీఎన్ గ్రౌండ్ లో విడిది చేయనున్నారు. మరి.. 57వ రోజు లోకేశ్ పాదయాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.