దళిత యువకుడు, తన దగ్గర పని చేసే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినందుకు గాను వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ప్రస్తుతం జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపింది. దీనిపై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేయడంతో.. ప్రభుత్వం అనంతబాబుని సస్పెండ్ చేసింది. ఇక సుబ్రహ్మణ్యాన్ని తానే హత్య చేశానని పోలీసుల విచారణలో ఎమ్మెల్సీ అనంత బాబు అంగీకరించిడంతో ఆయనను అరెస్ట్ చేసినట్లు.. కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ వెల్లడించారు. ఇక ప్రాథమిక విచారణలో అనంత బాబు వాంగ్మూలం, ఇప్పటి వరకు సేకరించిన సాంకేతిక ఆధారాలను బట్టి ప్రాథమిక దర్యాప్తులో ఆయనను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశామని తెలిపారు. నిందితుడిని కోర్టు ఆదేశాలతో, రిమాండ్ కు పంపించామని తెలిపారు.
ప్రస్తుతం జైల్లో ఉన్న అనంతబాబు ఫ్లెక్సీకి పాలభిషేకం నిర్వహించడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. దీని గురించి టీడీపీ నాయకుడు నారా లోకేష్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరలవుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలం ఇందుకూరుపేటలో వైసీపీ కార్యకర్తలు అనంత బాబు ప్లెక్సీల ఏర్పాటు చేయడమే కాక.. ఊరేగింపులు, పాలాభిషేకాలు కూడా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకురావడం వివాదానికి దారితీస్తోంది. తాజాగా అనంత బాబు ప్లెక్సీకి పాలాభిషేకంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు.
ఇది కూడా చదవండి: Somu Veerraju: బీజేపీ పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత.. SI ని తోసేసిన సోము వీర్రాజు
”దళిత యువకుడు సుబ్రహ్మణ్యంని అత్యంత కిరాతకంగా చంపిన ఎమ్మెల్సీ అనంతబాబుకి పాలాభిషేకం చేయించారు సీఎం జగన్ రెడ్డి. జైల్లో సకల సౌకర్యాలు, బయట ఫ్లెక్సీలతో ఊరేగింపులు చూస్తుంటే దళితులపై సాగుతున్న దమనకాండ అంతా జగన్ రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతోందని స్పష్టమవుతోంది” అని లోకేష్ ట్వీట్ చేశారు. ఈ ప్రభుత్వంలో నిందితులకు రక్ష, బాధితులకు శిక్షేనని మరోసారి రుజువైందన్నారు. దమనకాండ అంతా జగన్ రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతోందని స్పష్టమవుతోందని ఆరోపించారు. మని దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి KA పాల్ బంపర్ ఆఫర్!
దళిత యువకుడు సుబ్రహ్మణ్యంని అత్యంత కిరాతకంగా చంపిన ఎమ్మెల్సీ అనంతబాబుకి పాలాభిషేకం చేయించారు సిఎం జగన్ రెడ్డి. జైల్లో సకల సౌకర్యాలు, బయట ఫ్లెక్సీలతో ఊరేగింపులు చూస్తుంటే దళితులపై సాగుతున్న దమనకాండ అంతా జగన్ రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతోందని స్పష్టమవుతోంది.(1/3) pic.twitter.com/UshbQWXI6y
— Lokesh Nara (@naralokesh) June 14, 2022