గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్వల్ప అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. దీంతో వెంటనే స్పందించిన అతని కటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. విషయం ఏంటంటే.. రాజాసింగ్ జైలు నుంచి వచ్చే ముందు అతని నుదిటిపై ఓ గడ్డలా ఏర్పడిందని, దీని కోసం ఆయన ఆస్పత్రి వైద్యులను సంప్రదించడంతో వైద్యులు ఆయనకు లిపోమా సర్జీరీ చేశారు. ఈ మేరకు రాజాసింగ్ ఓ ఫోటోను ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ.. నేను జైలు నుంచి రాకముందు నా నుదిటిపై ఓ చిన్న గడ్డ మాదిరి ఉందని తెలిపారు. దీంతో అప్పటి నుంచి నొప్పిగా ఉండడంతో సోమవారం వైద్యులను సంప్రదించి లిపోమా సర్జరీ చేయించుకున్నట్లు తెలిపారు. దీని కారణంగా వైద్యులు ఒక వారం రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలన్నారు. నేను త్వరలోనే కోలుకుని గోషామహాల్ ప్రజల అందుబాటు ఉంటానని ఎమ్మెల్యే రాజాసింగ్ రాసుకొచ్చారు.
అయితే ఈ ఫొటోను చూసిన ఆయన అభిమానులు, నేతలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. రాజాసింగ్ త్వరగా కోలుకోవాలని దేవుడికి ప్రార్థిస్తున్నామని కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల మహ్మద్ ప్రవక్తపై ఎమ్మెల్యే రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పంచించిన కొందరు వ్యక్తులు రాజాసింగ్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత అతనిని అరెస్ట్ చేసి జైలుకు తరలించడం అంతా జరిగిపోయింది. అయితే ఈ క్రమంలోనే ఇటీవల రాజాసింగ్ జైలు నుంచి విడుదల అవ్వడం కూడా జరిగింది.
Before coming out of jail, I had a small lump on my forehead, due to which I had a lot of pain, Today, I had undergo Lipoma surgery.
The doctor advised me to take 1 week’s rest.
I will be among the people of my #Goshamahal very soon. pic.twitter.com/z4axUguzDl
— Raja Singh (@TigerRajaSingh) November 28, 2022