నిత్యం ఏదో అంశంతో ట్విట్టర్ లో స్పందిస్తూ తరుచు వివాదాల్లో పాలు పంచుకుంటారు టాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. అయితే తాజాగా రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్నుని ఉద్దేశించి వర్మ ట్విట్టర్ లో.. ‘ద్రౌపది రాష్ట్రపతి అయితే పాండవులు ఎవరు? మరి ముఖ్యంగా కౌరవులు అంటే ఎవరు? ’అంటూ తాజాగా ట్విట్ చేసిన విషయం తెలిసిందే. అయితే వర్మ పోస్ట్ పై స్పందించిన బీజేపీ నేతలు ఆగ్రహానికి గురవుతున్నారు.
రాష్ట్రపతి అభ్యర్ధిపై వర్మ ఇలా పోస్ట్ చేయడంతో బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న ద్రౌపతి ముర్ము ను కించపరిచే విధంగా ట్వీట్ చేశారని రామ్ గోపాల్ వర్మపై బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదులో చేశారు. ఇక వర్మ చేసిన ట్వీట్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు.
ఇది కూడా చదవండి: Ram Gopal Varma: రాంగోపాల్ వర్మపై పోలీసులకు ఫిర్యాదు!
ఈ క్రమంలోనే వర్మ ట్వీట్ పై తాజాగా స్పందించారు గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆదివాసీ రాష్ట్రపతి మహిళ అభ్యర్ధిపై వర్మ ఇలా పోస్ట్ చేయడం బాధాకరమన్నారు. రామ్ గోపాల్ వర్మ తాగి పోస్టులు పెడుతుంటాడని, అతనో వేస్ట్ ఫెలో అంటూ రాజాసింగ్ ఫైర్ అయ్యారు. ఇదే కాకుండా అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇక రాజా సింగ్ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు కేటీఆర్ పై కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాజాగా వర్మ రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
If DRAUPADI is the PRESIDENT who are the PANDAVAS ? And more importantly, who are the KAURAVAS?
— Ram Gopal Varma (@RGVzoomin) June 22, 2022