సాధారణంగా ఎన్నికల సమీపించే కొద్ది రాష్ట్రంలో హడావిడి ఎక్కువైతుంది. ఇది ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం మెుత్తం ఇదే పరిస్థితులు నెలకొంటాయి. ఇక ఎన్నికల నిబంధనలను అనుసరించి వైన్ షాపులను బంద్ చేస్తుంటాయి ప్రభుత్వాలు. ఈ క్రమంలో మందు బాబులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది ఓ రాష్ట్ర ప్రభుత్వం. వచ్చే మూడు రోజులు అనగా శుక్రవారం, శని, ఆదివారాలు వైన్ షాపులు మూతపడనున్నాయి. బార్లు, క్లబ్ లు, బెల్ట్ షాపుల్లోసైతం మద్యం అమ్మకాలు బంద్ కానున్నాయి. మరిన్ని వివరాల్లోకి వెళితే..
మందు బాబులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది ఢిల్లీ ప్రభుత్వం. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో వచ్చే మూడు రోజులు మద్యం దుకాణాలు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కానున్నాయి. శుక్ర, శని, ఆదివారాలు మద్యం దుకాణాలు పూర్తిగా మూసివేయాలని ఎన్నికల అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఢిల్లీలో డిసెంబర్ 4న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. దాంతో శుక్రవారం సాయంత్రం 5.30 గంటల నుంచి మళ్లీ డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం 5.30 గంటల వరకు బార్లు, వైన్ షాపులు, మిగతా మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఈ మేరకు ఎన్నికల కమీషన్ ఉత్తర్వులను జారీ చేసింది. ఎన్నికల నేపథ్యంలో ఎవరూ మద్యన్ని సరఫరా చేయడం కానీ, అమ్మడం కానీ, నిల్వ చేయడం కానీ చేయరాదని అధికారులు తెలిపారు. డిసెంబర్ 7న కౌంటింగ్ జరగనుంది. ప్రధాన పార్టీలు అయిన బీజీపీ, కాంగ్రెస్, ఆప్ మధ్య పోరు జరగనుంది.