స్టాండప్ కమెడియన్ టూ సీఎం పోస్ట్. పంజాబ్ ఎలక్షన్స్లో స్వీప్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ..ఇక సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న భగవంత్ మాన్ గురించే ఇప్పుడు గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. ఆల్ రెడీ ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఎంపీగా ఉన్న భగవంత్ మాన్.. ఇప్పుడు పంజాబ్ సీఎం పీఠాన్ని అధిష్టించనున్నారు. మరి సామ్యానుడి స్థాయి నుంచి సీఎం స్థాయికి ఆయన జీవిత ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకుందాం..
భగవత్ మాన్ పంజాబ్లోని సంగ్రూర్ జిల్లాలోని సతోజ్ గ్రామంలో 1973 అక్టోబర్ 17న జన్మించారు. ఎన్నికల అఫిడవిట్లో భగవత్ మాన్ తాను 12వ తరగతి పాసయ్యానని పేర్కొన్నారు. 1992లో బీకామ్ చేయడానికి షాహీద్ ఉధమ్ సింగ్ ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్ తీసుకున్నా అయన చదువు పూర్తి కాలేదు. ఆ తర్వాత ఇంద్రప్రీత్ కౌర్ను వివాహం చేసుకున్నారు. ఎంపీ అయిన ఏడాదికే ఆయన భార్యతో విడిపోయారు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భగవంత్ మాన్.. పంజాబ్ పీపుల్స్ పార్టీతో తన రాజకీయ ప్రవేశం చేశారు. 2012 సంవత్సరంలో లెహ్రా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. భగవంత్ మాన్ 2014లో ఆమ్ ఆద్మీ పార్టీలో సంగ్రూర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు.
ఈ ఏడాది జనవరి 18న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తమ సీఎం అభ్యర్థిగా ఒకప్పటి భగవంత్ మాన్ పేరును ప్రకటించింది. ప్రజాభిప్రాయాన్ని బట్టి సీఎం అభ్యర్థిని ఎంపిక చేశామని.. వాట్సాప్, మిస్డ్ కాల్, ఎస్సెమ్మెస్ తదితర మార్గాల్లో ప్రజలు తమ ప్రియతమ నేతను సీఎం అభ్యర్థిగా ఎన్నుకున్నారని.. భగవంత్ మాన్కు 93.3 శాతం మంది మద్దతు పలికారని ఆ సందర్భంలో కేజ్రీవాల్ చెప్పారు. దీంతో పంజాబ్ లో ఆప్ పార్టీ విజయం సాధించడంతో భగవంత్ మాన్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆప్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ సీఎం పీఠంపై కూర్చునేందుకు రంగం సిద్ధమైంది. సామాన్యుడి నుంచి సీఎం స్థాయికి ఎదిగిన భగవంత్ మాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.