రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు అని సామెత. పార్టీ సిద్ధాంతలకు అనుగుణంగా నేతలు మసులుకుంటారు. ప్రజల పక్షనా నిలబడి కొట్లడతారు. కానీ వ్యక్తిగత జీవితంలో నేతల మధ్య మంచి సంబంధాలే ఉంటాయి. ఏదైన ప్రైవేట్ ఫంక్షన్లలో కలిస్తే.. ఆత్మీయంగా పలకరించుకుంటారు. అది చూసి అభిమానులు, కార్యకర్తలు సంబరపడతారు. ఈ విషయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఓ అడుగు ముందే ఉంటారు. స్వపక్షం, విపక్షం అనే తేడా లేకుండా అందరితో మంచి సంబంధాలు కొనసాగిస్తారు. తాజాగా మరోసారి ఇదే విషయాన్ని వెల్లడించారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో ఉన్న సంబంధాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఏపీ సీఎం జగన్ తనకు పెద్దన్నలాంటి వారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ సైతం ఆయనను ఆప్యాయంగా చూస్తారని చెప్పారు. అలానే మాజీ సీఎం చంద్రబాబు నాయుడితో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో, సీఎం జగన్మోహన్రెడ్డితో చక్కటి సంబంధాలు ఉన్నాయి. విభజన తర్వాత రెండు రాష్ట్రాల ఏర్పాటు జరిగిన క్రమంలో కొన్ని కొన్ని అంశాలు పరిష్కారం కాలేదు. నిర్ణయాలు తీసుకోవాల్సిన కొన్ని అంశాలకు సంబంధించి సమస్యలు ఉంటే ఉండొచ్చు. కానీ మా మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. జగన్ నాకు పెద్దన్న లాంటి వాడు. ముఖ్యమంత్రి కేసీఆర్కు తనతో మంచి సంబంధాలు ఉన్నాయి. వారితో ఎప్పుడు ఎలాంటి పంచాయతీ లేదు’’ అని తెలిపాడు.
ఇది కూడా చదవండి: AP Man: KTR సీఎం కావాలని.. ఆంధ్రా యువకుడి పాదయాత్ర.. విజయవాడ To హైదరాబాద్!‘‘ఇక చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు కూడా మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఆయనే రాజకీయంగా మాతో విబభేదించి.. మా ప్రత్యర్థులతో చేతులు కలిపి.. ఏవో ఊహించుకున్నారు తప్ప.. మాకేనాడు ఆయనతో తగాదా లేదు. అందరితో కలిసి మెలిసి ఉండాలనే స్ఫూర్తితోనే ముందుకు సాగుతాం. అందిరితో కలిసే ఉంటాం’’ అని తెలిపారు. కేటీఆర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Davos 2022: దావోస్ వేదికగా అరుదైన కలయిక.. నెట్టింట వైరలవుతోన్న KTR, సీఎం జగన్ ఫోటోలు!