వైసీపీ పార్టీలోని ముఖ్యనేతల్లో కొడాలి నాని ఒకరు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటు చేసిన తొలి కాబినెట్ లోనే కొడాలి నానికి చోటు దక్కింది. మూడేళ్ల తరువాత జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఆయన చోటు కోల్పోయారు. అయితే తాజాగా మరోసారి కొడాలి నానికి మంత్రి పదవి రానున్నట్లు తెలుస్తోంది.
మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గురించి రాజకీయలపై అవగాహన ఉన్నవారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన మాటలతో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు. కొడాలి నాని తరచూ ప్రతిపక్ష పార్టీ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుక పడుతుంటారు. ముఖ్యంగా చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ పై నాని ఓ రేంజ్ లో ఫైర్ అవుతుంటారు. వైసీపీ పార్టీలోని ముఖ్యనేతల్లో కొడాలి నాని ఒకరు. అందుకే జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటు చేసిన కాబినెట్ కొడాలి నానికి చోటు దక్కింది. మూడేళ్ల తరువాత జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఆయన చోటు కోల్పోయారు. అయితే తాజాగా మరోసారి కొడాలి నానికి మంత్రి పదవి రానున్నట్లు తెలుస్తోంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఏపీలో మరో ఏడాదిలో సార్వత్రికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నాయి. అలానే ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాల్లో మంత్రి వర్గంలో మార్పులు ఒకటి. ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఆ వార్తలు బలం చేకూర్చేలా ఇటీవలే సీఎం జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో కేబినెట్ ప్రక్షాళన గురించి చర్చకు వచ్చినట్లు సమాచారం.
ఈ సారి మంత్రి వర్గ విస్తరణలో అనూహ్యంగా మాజీ మంత్రులు కొందరు రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలానే ఇటీవల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఒకరిద్దరికి కూడా మంత్రి పదవులు దక్కుతాయని సమాచారం. ఇప్పటికే కొందరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాజీ మంత్రి కొడాలి నాని పేరు ప్రధానంగా వినిపిస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటు చేసిన కేబినేట్ లో ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రిగా పని చేశారు. మంత్రిగా ఉన్న సమయంలో తన పనితీరుతో జగన్ మోహన్ రెడ్డి దగ్గర కొడాలి నాని మంచి మార్కులు సంపాదించారు. ప్రతిపక్షాలు చేసే విమర్శలకు కొడాలి నాని ధీటుగా సమాధానాలు ఇస్తారు.
అంతేకాక ప్రతిపక్ష పార్టీ నాయకుడు చంద్రబాబు, ఇతర నేతలపై కొడాలి నాని ఒంటికాళ్లుపై లేస్తారు. ఇలా ప్రతిపక్ష నాయకులను విమర్శిస్తూనే, తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, ఇతర కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. తన మంత్రిపదవి కాలంలో కొడాలి నాని సీఎం దగ్గర మంచి గుర్తింపే సంపాదించారు. ఆ కారణంతోనే కొడాలి నానికి మరోసారి మంత్రి పదవి రానున్నట్లు తెలుస్తోంది. జగన్ ప్రస్తుతం క్యాబినెట్లో మార్పులు చేర్పులపై తీవ్రమైన కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. దీంతో, సీఎం జగన్ తుది నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. మరి.. కొడాలి నానికి మరోసారి మంత్రి పదవి రానున్నట్లు వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.