ఏపీలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కెతున్నాయి. ఎన్నికలు ఇంకా రెండేళ్లు ఉన్నా.. అధికార, విపక్షాల మధ్య మాత్రం మాటల యుద్ధం జరుగుతోంది. సందర్భం దొరికిన ప్రతి సారి విపక్ష నేతలు.. ప్రభుత్వ నేతలపై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. పురంధేశ్వరిపై ఘాటు విమర్శలు చేశారు. గుడివాడలో అభివృద్ధిని అడ్డుకుంటే.. తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. అన్న ఎన్టీఆర్ రెండు సార్లు ప్రాతినిధ్యం వహించిన గుడివాడలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
గుడివాడ పురపాలక సంఘం కార్యాలయంలో కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. “ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, ఎంపీ వల్లభనేని బాలశౌరిల కృషితో గుడివాడ ప్రజల సుదీర్ఘ సమస్య అయిన రైల్వే గేట్లపై ఫ్లైఓవర్లు మంజూరు. అయ్యాయి. కేవలం 10 మంది వ్యాపారుల ప్రయోజనాల కోసం లక్షలాది మందికి ఉపయోగపడే ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని అడ్డుకోవడం దారుణం. ఫ్లైఓవర్ నిర్మాణం ఆగిపోతే గుడివాడ మీదుగా వెళ్లే రైళ్లను అడ్డుకుంటాం.. పురంధేశ్వరి పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలి. ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని అడ్డుకుంటే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది” అని కొడాలి నాని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Kodali Nani: ఆ పసి పిల్లలపై ట్రోల్స్ ఏంటి? దమ్ము ఉంటే మాతో పోరాడండి: కొడాలి నాని!
ఇది కూడా చదవండి: Lokesh: లోకేశ్ జూమ్ మీటింగ్ లోకి సడెన్ గా ఎంట్రీ ఇచ్చిన కొడాలి నాని, వల్లభనేని వంశీ!