Lokesh: టెన్త్ విద్యార్థులతో టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ బాబు నిర్వహించిన జూమ్ మీటింగ్ రసాభాసగా మారింది. ఈ జూమ్ మీటింగ్లోకి కొందరు వైసీపీ నేతలు సడెన్ ఎంట్రీ ఇవ్వటంతో గందరగోళం నెలకొంది. గురువారం లోకేశ్ కొందరు టెన్త్ విద్యార్థులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఆన్లైన్ జూమ్ మీటింగ్లో పాల్గొన్న విద్యార్థులతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇద్దరు విద్యార్థుల ల్యాప్ట్యాప్లోంచి కొడాలి నాని, వల్లభనేని వంశీ జూమ్ మీటింగ్లోకి సడెన్ ఎంట్రీ ఇచ్చారు. జూమ్ మీటింగ్లో వారిద్దరినీ చూడటంతో నిర్వహకులు షాక్ తిన్నారు. వెంటనే వారి కనెక్షన్ను కట్ చేశారు.
ఓ విద్యార్థి వంశీ ఆఫీసునుంచి ఆయన ల్యాప్ట్యాప్తోనే జూమ్ మీటింగ్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు! వైఎస్సార్ సీపీ నేత దేవేందర్ రెడ్డి కూడా ఈ మీటింగ్లోకి సడెన్ ఎంట్రీ ఇచ్చారు. లోకేశ్ మాట్లాడే ప్రయత్నం చేశారు. విద్యార్థులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయటం ఏంటని ప్రశ్నించారు. దీంతో లోకేశ్ వైఎస్సార్ సీపీ నేతలందరికీ కౌంటర్ ఇచ్చారు. తాను జూమ్లో కాదు నేరుగానే మాట్లాడుతానంటూ సవాల్ విసిరారు. మరి, లోకేశ్ జూమ్ మీటింగ్ లోకి వైఎస్సార్ సీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, దేవేందర్ రెడ్డిల సడెన్ ఎంట్రీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : YS Jagan: ఆ ఏడుగురు MLA లకు ఈ సారి నో టికెట్.. తేల్చి చెప్పిన సీఎం జగన్!