KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 2020 గల్వాన్ లోయలో జరిగిన చైనా బలగాల దాడిలో చనిపోయిన బిహార్కు చెందిన ఆర్మీ అమరవీరుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పన అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ‘బీజేపీ ముక్త్ భారత్’కు పిలుపునిచ్చారు. రూపాయి విలువ తగ్గుదల,రైతుల ఆందోళన, నిరుద్యోగం, ధరల పెరుగుదలపై నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇక, గురువారం మహా కూటమిపై ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్లో కేసీఆర్,నితీశ్ పాల్గొన్నారు. మీటింగ్ సందర్భంగా ఓ ఆశ్చర్యకర సంఘటన చోటుచేసుకుంది.
కేసీఆర్ ప్రెస్ మీట్లో కూటమి గురించి మాట్లడుతున్నారు. జర్నలిస్ట్లు ప్రశ్నలు వేస్తున్నారు. కొంతమంది వేసిన ప్రశ్నలకు నితీశ్కు కోపం వచ్చింది. వెంటనేపైకి లేచి వెళ్లిపోవటానికి సిద్ధమయ్యారు. దీంతో కేసీఆర్ ఆయన్ని ఆపి కూర్చోబెట్టారు. కొద్ది సేపటి తర్వాత మరోసారి నితీశ్ పైకి లేచారు. ఈ సారి కేసీఆర్ ఎంత చెప్పినా ఆయన వినలేదు. ‘‘ మీరు కూర్చోండి’’ అని కేసీఆర్ అంటుంటే.. ‘‘ లేవండి పోదాం’’ అని నితీశ్ అన్నారు. దీంతో మీటింగ్ రసాభాసగా మారింది. అలా చాలా సేపు నితీశ్ నిలబడే ఉన్నారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను బీజేపీ లీడర్లు కొందరు తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ.. ‘‘ కేసీఆర్కు నితీశ్ ఇచ్చే మర్యాద ఇదేనా.. కేసీఆర్ను అవమానపరిచారు’’ అని అంటున్నారు. ఇక, ప్రెస్మీట్లో నితీశ్ ప్రవర్తనను ప్రత్యర్థులు వక్రీకరించారంటూ నితీశ్ సన్నిహితులు మండిపడుతున్నారు. జర్నలిస్టులు పదేపదే ఒకే ప్రశ్న అడగటం వల్ల ఆయనకు కోపం వచ్చి అలా చేశాడన్నారు. అందులో కేసీఆర్ను అవమానించాలన్న ఉద్దేశ్యంలేదని స్పష్టం చేశారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Did KCR travel to Patna to get insulted like this? Nitish Kumar didn’t even accord him the basic courtesy of completing his point in a press interaction. Nitish was dismissive of KCR’s pleas to let him finish. But then that is Nitish Kumar. Self conceited. KCR asked for it… pic.twitter.com/k9BQPo6FCI
— Amit Malviya (@amitmalviya) August 31, 2022
ఇవి కూడా చదవండి : Rajaiah: కడియం శ్రీహరి ఓ దళిత దొర.. మండిపడ్డ ఎమ్మెల్యే రాజయ్య!