కరోనా కారణంగా రాష్ట్ర ప్రజలు ఉపాధి లేక ఆర్థికంగా అల్లాడుతుంటే పాలకులకు మాత్రం వారి ప్రయోజనాలే ముఖ్యంగా భావిస్తున్నారు. అందుకే ప్రజాప్రతినిధుల జీతాలు, ఇతర భత్యాలను ఎప్పటికప్పుడు భారీగా పెంచుకుంటారని కొందరి అభిప్రాయం. తాజాగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల వేతనాలను, పెన్షన్లను కర్ణాటక ప్రభుత్వం పెంచేసింది. ఈ మేరకు మంగళవారం విధానసభలో దీనికి సంబంధించిన రెండు బిల్లులను ఆమోదించారు. ప్రస్తుతం ఉన్న జీతాలతో పోలీస్తే 50 శాతం కొత్త జీతాలు పెరిగాయి.
ఈ బిల్లులకు సంబంధించి మంత్రి మధుస్వామి మాట్లాడుతూ..” కోవిడ్ సమయంలో పరిస్థితులు దారుణంగా మారిపోయినాయి. పెట్రోల్, డీజిల్, ఇతర ఇంటి అద్దెల ధరలు భారీగా పెరిగాయి. అందువల్లే ప్రజాప్రతినిధుల జీతభత్యాలను పెంచాల్సి వచ్చింది. 2015 తరువాత నుంచి ఇప్పటీ వరకు వేతనాలు పెంచలేదు. కొత్త జీతాల పెంపుతో ప్రభుత్వం ఖజానాపై ఏటా రూ.92 కోట్ల భారం పడుతుంది” అని తెలిపారు. కొత్తగా పెరిగిన వేతనాల ప్రకారం.. ముఖ్యమంత్రికి రూ.50-75 వేలు , మంత్రుల జీతంలో రూ.40-60వేల మధ్య పెరుతున్నట్లు తెలుస్తోంది. వారి వార్షిక అలవెన్స్లు అన్ని కలిపి రూ.4.5 లక్షలకు చేరుతుంది.
మంత్రుల నెలవారి ఇంటి అద్దె రూ.1.25 లక్షలకు పెంపు. ఇంటి ముందు తోట నిర్వహణ భత్యం రూ.30 వేలకు పెంపు.నెలకు వెయ్యి లీటర్లకు ఉన్న ఇంధన వ్యయం ఇప్పుడు 2 వేల లీటర్లకు పెంచారు. సభాపతులు, ప్రతిపక్ష నేతలకు కూడా ఇవే జీతభత్యాలు వర్తిస్తాయి. MLA, MLC విషయానికి వస్తే వారి జీతంలో రూ.25– 40 వేల వరకూ పెరుగుతుంది. నెలవారి నియోజకవర్గ భత్యం రూ. 60 వేలుగా నిర్ధారణ. మాజీ ప్రజాప్రతినిధులకు నెలకు రూ.50 వేల పెన్షన్ లభిస్తుంది. మరి కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.