మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ దాడులు చేయడంతో తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇక ఇన్ కమ్ టాక్స్ దాడుల కారణంగానే తన కొడుకు ఆస్పత్రి పాలైయ్యాడని మంత్రి మల్లారెడ్డి ఆరోపించాడు. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీజేపీ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ రాముడి పేరు చెప్పి రౌడీయిజం చేస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీలో చేరకపోతే ఇలా ఇన్ కమ్ టాక్స్ దాడులు చేయించడం కాషాయ పార్టీకి అలవాటే అని విమర్శించారు. తాజాగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నాగిరెడ్డిపేటలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
గత నెల రోజుల TRS ఎమ్మెల్యేలు, మంత్రులే టార్గెట్ గా కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నాగిరెడ్డిపేట లో జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆమె మంత్రి మల్లారెడ్డి ఇంటిపై జరిగిన ఐటీ దాడులపై స్పందించారు. కవిత మాట్లాడుతూ..”బీజేపీ వాళ్లకు ఉన్న పని ఒక్కటే.. రామ్ రామ్ జప్నా.. పరాయి లీడర్ అప్నా. ఇతర పార్టీల నుంచి నాయకులను తీసుకొచ్చి, తమ పార్టీలో చేర్చుకుని రాజకీయాలు చేయడమే బీజేపీ పని. తమ పార్టీలో చేరకపోతే కేసులు పెట్టి, లేదా ఇలా ఐటీ దాడులు చేయించి భయపెట్టడమే బీజేపీ వాళ్ల పని” అని విమర్శించారు. ఇక మీరు ఎన్ని దాడులు చేసుకుంటారో చేసుకోండి.. కానీ మేం మాత్రం భయపడం అని కవిత అన్నారు. తప్పు చేయాల్సిన అవసరం మాకు లేదని, మేం వ్యాపారాన్ని నిజాయితీగానే చేస్తామని ఈ సందర్బంగా కవిత చెప్పుకొచ్చారు. అయితే కొన్ని రోజుల క్రితం గంగుల కమలాకర్ ఇంటిపై కూడా ఐటీ దాడులు జరిగిన విషయం మనకు తెలిసిందే.