కేఏ పాల్.. ఒకప్పుడు ఈయనో పీస్ మేకర్.. ప్రపంచ వ్యాప్తంగా లక్షలు, కోట్ల మంది ప్రజలను తన ప్రసంగాలతో ఉర్రూతలూగించారు. వారిలో పెను మార్పులను తెచ్చారు. తన ఒక్క మాటతో దేశాల మధ్య యుద్దాలను సైతం ఆపారు. ఒకానొక దశలో ఆయన కోసం దేశాధినేతలే వేచి ఉండేవారంటే ఆయన కెపాసిటీ ఏంటో తెలిసిపోతుంది. అలాంటి ఆయన జీవితంలో పదేళ్ల క్రితం ఓ అనుకోని మార్పు చోటుచేసుకుంది. వరల్డ్ నెంబర్ వన్ పీస్ మేకర్గా ఉన్న ఆయన అథఃపాతాలానికి పడిపోయారు. తర్వాతినుంచి ఆయన ప్రాభల్యం తగ్గుతూ వచ్చింది. 2008లో ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రజాశాంతి పార్టీతో ప్రజల్లోకి వెళ్లారు. అయితే, ఆయనకు ప్రజల నుంచి మద్దతు లభించలేదు. చివరకు కమెడియన్ అన్న ముద్ర వేసుకున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా.. తనను ఎంత కామెడీ చేసినా పాల్ సింహంలాగా ముందుకు దూసుకు వెళుతున్నారు.
రాజకీయాల్లో తనదైన మార్కును చూపిస్తున్నారు. సమస్య ఏదైనా సూటిగా స్పందించటం ఆయన నైజంగా మారింది. ఇందుకు తాజా ఉదాహరణే.. చంద్రబాబు సభల్లో చోటుచేసుకున్న మరణాలపై ఆయన గట్టిగా స్పందించటం. కందుకూరు, గుంటూరు తొక్కిసలాట ఘటనల్లో దాదాపు 11 మంది చనిపోయారు. ఈ ఘటనపై ఎవ్వరూ గట్టిగా మాట్లాడలేదు. ఒక్క కేఏ పాల్ తప్ప. సభలు పెట్టి జనాల ప్రాణాలు తీయటం ఏంటని ప్రశ్నించారు. చనిపోయిన వారి ప్రాణాలకి విలువ లేదా? అంటూ నిలదీశారు. నిలదీయటమే కాదు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై కేసు పెట్టారు.
కోర్టులో పిల్ వేశారు. ప్రజల ప్రాణాలు తీసే ఇలాంటి సభలను రద్దు చేయాలి డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి కేవలం ప్రతిపక్షాన్ని మాత్రమే కాదు.. అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కూడా ఆయన తప్పు బడుతున్నారు. ప్రభుత్వం తప్పు ఉందంటూ మండిపడ్డారు. 11 మంది నిండు ప్రాణాలు తీసుకున్న ఈ సంఘటనలపై పవన్ కల్యాణ్ గట్టిగా స్పందించకపోవటంపై కూడా పాల్ సీరియస్ అయ్యారు. మౌనంగా ఉండిపోయిన పవన్ ని.. ఎందుకు స్పందించవు? ప్రశ్నించవు? అని నిలదీశారు. కేఏ పాల్ ఈ సంఘటనలపై గట్టిగా స్పందించటంలో అర్థం ఉంది. ఈ ఘటనలు గనుక వేరే రాష్ట్రాల్లో చోటుచేసుకుని ఉంటే చాలా సీరియస్ గా తీసుకునేవారు. పెద్ద ఎత్తున చర్చలు జరిపి ఇలాంటివి ఇకపై జరగకుండా చర్యలు తీసుకునేవారు.
కానీ, ఏపీలో జరిగిన ఈ విషాదకర ఘటనలపై ఎవ్వరూ నోరు మెదపటం లేదు. అస్సలు ఇలాంటి ఘటనలు ఏపీలో జరిగాయా? అనేలా కొందరు రాజకీయ నాయకులు ప్రవర్తిస్తున్నారు. కానీ, కేఏ పాల్ మాత్రం బెబ్బులిలా ఈ సంఘటనలపై స్పందిస్తున్నారు. నిక్కచ్చిగా, ఓ మగాడిలా ఇటు ప్రతి ప్రక్షాన్ని, అటు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అందుకే ఏపీ ప్రజలకి కేఏ పాల్ ఇప్పుడు బాగా నచ్చుతున్నారు. ఏపీలో కేఏ పాల్ ని మించిన మగాడు లేడా? పాల్ సర్ మీరు గ్రేట్! అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కేఏ పాల్ సర్ మమ్మల్ని క్షమించండి అంటూ సగటు ఏపీ ఓటర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మరి, ఏపీ రాజకీయాల్లో విప్లవాలకు నాంది పలుకుతున్న కేఏ పాల్ రాజకీయాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.