ఆమ్ ఆద్మీ పార్టీ మెంబర్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్.. వారం రోజుల పర్యటన కోసం జర్మనీ వెళ్లారు. ఈ నెల 11 నుండి 18 వరకూ జర్మనీ పర్యటనను ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే పంజాబ్ సీఎం ఈ నెల 11న ఢిల్లీ నుండి జర్మనీ బయలుదేరారు. అయితే 18వ తేదీ ఆదివారం రాత్రి జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ విమానాశ్రయం నుండి ఢిల్లీ రావాల్సిన లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ విమానం 4 గంటలు ఆలస్యంగా బయలుదేరింది. దీనికి కారణం సాంకేతిక లోపం అని మొదట చెప్పినా.. ఆ తర్వాత ఈ ఆలస్యానికి కారణం పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ చేసిన ఘనకార్యమే అన్న ఆరోపణలు వస్తున్నాయి. భగవంత్ మాన్ సింగ్, అతని భార్య, సెక్యూరిటీ సిబ్బందితో కలిసి విమానం ఎక్కారు. విమానంలోకి ఎక్కగానే భగవంత్ మాన్ సింగ్ అడుగులు తడబడ్డాయట.
Opposition says Punjab CM Bhagwant Mann deplaned at Franfurt for being ‘drunk’; AAP trashes charge https://t.co/BOAhi8cMX7
— TOI India (@TOIIndiaNews) September 19, 2022
మాన్ భార్య మరియు సెక్యూరిటీ సిబ్బంది కలిసి సీఎంను పట్టుకుని నడిపించసాగారు. అయినప్పటికీ సీఎం భగవంత్ సింగ్ మాన్ నడవలేకపోతుండడంతో.. తోటి ప్రయాణికులు అనుమానంతో ఎయిర్ లైన్స్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ఎయిర్ హోస్టెస్ తో పాటు అటెండర్ కూడా మాన్ కి సాయం చేయాలని చూశారు. కానీ ఫలితం లేకపోయింది. విమానం బయలుదేరేందుకు ఆలస్యం అవుతుండడంతో.. తోటి ప్రయాణికులు అభ్యంతరం పెట్టారు. అతన్ని(భగవంత్ మాన్ ను) విమానంలోకి అనుమతిస్తే తాము దిగిపోతామని అన్నారు. దీంతో కెప్టెన్.. భగవంత్ సింగ్ మాన్ ను, తన భార్యని, సెక్యూరిటీ సిబ్బందిని విమానం దిగిపోవాలని విజ్ఞప్తి చేశాడు. అయితే సెక్యూరిటీ సిబ్బంది, ఈయన ముఖ్యమంత్రి అని, చాలా అపాయింట్మెంట్లు ఉన్నాయని చెప్పారు. అయినప్పటికీ కెప్టెన్ లెక్క చేయలేదు.
Aam Aadmi Party denied the claims that suggested Chief Minister Bhagwant Mann was deplaned in Germany for being drunk. CM Mann was on an eight-day trip to #Germany and returned to India yesterday.#AamAadmiParty #Punjab #Delhi #BhagwantMann #Punjab #Drunk #India #TheFirstIndia pic.twitter.com/ShSdvlPCHr
— First India (@thefirstindia) September 19, 2022
కెప్టెన్ నిర్ణయాన్నే ఏ ఎయిర్ లైన్స్ అయినా పాటించాలి. ఎయిర్ లైన్స్ సిబ్బంది.. భగవంత్ సింగ్ మాన్ ను, అతని సిబ్బందిని దిగిపోవాలని కోరడంతో చేసేదేమీ లేక వారు దిగిపోయారు. లగేజీ తీసుకునే దగ్గర 4 గంటలు ఆలస్యం కావడంతో ఫ్రాంక్ ఫర్ట్ లో సాయంత్రం 5.52 కి బయలుదేరిన విమానం మరుసటి రోజు ఉదయం 4.30కి చేరుకుంది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1.40కి బయలుదేరాల్సి ఉండగా.. సీఎం వల్ల 5.52కి బయలుదేరింది. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మాత్రం సీఎంకు స్వల్ప అస్వస్థత కారణంగా ప్రయాణం వాయిదా పడిందని చెప్పుకొచ్చారు. అయితే సోషల్ మీడియా పుణ్యమా అని అప్పటికే ఈ వార్త వ్యాపించింది. భగవంత్ సింగ్ మాన్ తాగి విమానం ఎక్కినందుకే దించేశారని ఆరోపణలు వస్తున్నాయి.
ఈ నెల 11 నుంచి 18 వరకూ భగవంత్ సింగ్ మాన్.. బెర్లిన్, మ్యూనిచ్, ఫ్రాంక్ ఫర్ట్ లలో పర్యటించారు. అయితే వచ్చే ముందు డ్రింక్ టెక్ 2022 అనే అంతర్జాతీయ మద్యం ఎగ్జిబిషన్ కి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఎగ్జిబిషన్ ప్రతీ నాలుగు సంవత్సరాలకొకసారి జరుగుతుందట. ప్రపంచంలోని అన్ని దేశాల మద్యం బ్రాండ్ల కంపెనీలన్నీ ఈ ఎగ్జిబిషన్ లో పాల్గొంటాయట. భగవంత్ సింగ్ మాన్ డిప్లొమాట్ హోదాలో ఈ ఎగ్జిబిషన్ లో పాల్గొన్నారట. కాబట్టి అక్కడ మద్యం పుచ్చుకుని ఉండవచ్చునని, అలానే ఆ ఫారిన్ సరుకుని కొనుక్కుని భారీగా లగేజ్ బ్యాగ్స్ లో ప్యాక్ చేసి తరలించేందుకు ప్రయత్నించారని, ఈ క్రమంలోనే ఫ్లైట్ సిబ్బందికి దొరికేశారంటూ ఆరోపణలు వస్తున్నాయి. మరి ఈ ఆరోపణల్లో నిజం ఎంత ఉందో అనేది తెలియదు గానీ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కాబట్టి ఈ విషయం బయటికి రానివ్వలేదని, అదే వేరే పార్టీ అయి ఉంటే ఈ పాటికి రచ్చ రచ్చ చేసేవారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి పంజాబ్ సీఎం మద్యం సేవించి విమానం ఎక్కాడని మీరు నమ్ముతున్నారా? ఈ వ్యవహారంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.