సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. సినిమాల్లో మంచి పనులు చేసినట్టు, ప్రజా సేవ చేసినట్టు నటిస్తే సరిపోతుంది. కానీ రియల్ లైఫ్ లో, రాజకీయ జీవితంలో నటిస్తే ఒప్పుకోరు. రియాలిటీలో చూపించాలి. లేదంటే జనం చొక్కా పట్టుకుని నిలదీస్తారు. పెద్ద స్టార్ హీరో అయితే చొక్కా పట్టుకోరు గానీ ఆల్మోస్ట్ పట్టుకునే స్థాయికి వెళ్తారు. ప్రజల్లో వచ్చే అసహనం అలాంటిది మరి. సినిమాల్లో నటించేసి హీరో అనిపించుకున్నా.. రాజకీయాల్లో మాట మీద నిలబడి చేతల్లో చూపించాలి. అదే నాయకుడి లక్షణం. బాలయ్య హీరోగా తోపు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ రాజకీయ నాయకుడిగా మాత్రం ఏంటనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఏమీ చేయకపోతే నిలదీస్తారు కూడా. జనం ఒకప్పటిలా లేరు. సోషల్ మీడియా వచ్చాక వాళ్లలో ధైర్యం బాగా వచ్చింది.
ఎంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్నా గ్రౌండ్ లోనే నిలబెట్టి అడిగేస్తున్నారు, కడిగేస్తున్నారు. తాజాగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ విషయంలో ఇదే జరిగింది. తమని పట్టించుకోకుండా సెల్ఫీలు దిగుతున్నారని బాలకృష్ణపై హిందూపురం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం అనంతపురంలో జరిగిన తన వీరాభిమాని కుమార్తె వివాహానికి బాలకృష్ణ హాజరయ్యారు. పెళ్లి వేడుకలో సందడి చేశారు. ఆ తర్వాత బెంగళూరు వెళ్తూ.. హిందూపురంలోని వరద ముంపుకు గురైన ప్రాంతాలను పర్యటించారు. హీరో బాలకృష్ణ కాబట్టి ప్రజలు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఆయన కూడా సెల్ఫీలు దిగుతున్నారు.
దీంతో మారుతీనగర్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్ఫీ ఫోటోలకి ప్రాధాన్యమిస్తూ.. తమ బాధలను పట్టించుకోకపోవడంతో స్థానిక మహిళలు ఆగ్రహానికి గురయ్యారు. ‘మా బాధలు చెప్పుకుందామని మేము వస్తే.. సెల్ఫీలు దిగుతున్నాడు. ఆయప్ప సెల్ఫీలు దిగడానికే ఇక్కడకి వచ్చాడా? మా బాధలు చెప్పుకునే అవకాశం ఇవ్వడం లేదు. వరదల కారణంగా ఇళ్లలోకి నీళ్లు చేరి ఇబ్బందులు పడుతున్నాం’ అంటూ టీడీపీ నాయకులని నిలదీశారు. దీంతో టీడీపీ నాయకులు.. వారిని తీసుకెళ్లి బాలకృష్ణతో మాట్లాడించారు. వారి సమస్యలు విన్న బాలకృష్ణ.. మీకు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తామని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు.
సెల్ఫీల కోసం వచ్చావా.. బాలయ్యా!
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తీరుపై హిందూపురం ప్రజల ఆగ్రహం
తమ బాధలను పట్టించుకోకపోవడంపై మండిపాటు pic.twitter.com/KUCxNHU8An
— Rahul (@2024YCP) October 17, 2022