భారతదేశ రాజ్యాంగం.. రాష్ట్రపతిని దేశ ప్రథమపౌరుడిగా గుర్తించింది. త్రివిధ దళాలకు కూడా ఆయనే అధిపతి. కేంద్ర కేబినెట్ తీసుకునే నిర్ణయాలు, మన దేశం ఇతర దేశాలతో కుదుర్చుకునే ఒప్పందాలు అన్ని రాష్ట్రపతి పేరుమీదుగానే జరుగుతాయి. మన రాజ్యాంగం రాష్ట్రపతికి అంతటి అత్యున్నత స్థానం కల్పించింది. ఇక మన దేశంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ప్రస్తుతం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవి కాలం జూలై 24న ముగియనుంది. ఇక నూతన రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుద చేసింది. రాష్ట్రపతి ఎన్నికకు జూలై 18న ఓటింగ్ నిర్వహించనున్నట్టు భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం ప్రకటించింది. జూలై 21న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఈసీ తెలిపింది. ఈ ఎన్నికల ద్వారా భారత 16వ రాష్ట్రపతినిఎన్నుకోనున్నారు. ఇంతవరకు 15 సార్లు రాష్ట్రపతి ఎన్నికలను ఈసీ విజయవంతంగా నిర్వహించింది. రాష్ట్రపతి పదవీకాలం ముగిసే ముందు 60వ రోజు గానీ, ఆ తర్వాత గానీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించవచ్చు.
అర్హతలు..
రాష్ట్రపతిగా ఎన్నిక కాబడే వ్యక్తి.. భారతీయుడై ఉండాలి. 35 సంవత్సరాలు నిండి ఉండాలి. పార్లమెంట్లోని ఏదో ఓ సభకు ఎన్నికోవడానికి అర్హత కలిగి ఉండాలి. ఎలాంటి లాభదాయకమైన పదవిలో ఉండకూడదు.
నామినేషన్ ప్రక్రియ..
నామినేషన్ పత్రాలు ఢిల్లీలో మాత్రమే ఇస్తారు. అభ్యర్థుల నామినేషన్ను తప్పనిసరిగా ఎలక్టోరల్ కాలేజీలోని 50 మంది ప్రపోజ్ చేయాలి. మరో 50 మంది సపోర్ట్ చేయాలి. నామినేషన్ను ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల మధ్యలో దాఖలు చేయవచ్చు. రూ.25,000 ధరావతు కూడా చెల్లించాల్సి ఉంటుంది.
ఎన్నిక విధానం..
రాష్ట్రపతిని పరోక్ష పద్దతిలో ఎలక్ట్రోరల్ కాలేజి సభ్యులు ఎన్నుకుంటారు. వీరు పార్లమెంట్ ఉభయసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు, రాష్ట్ర శాసనసభకు, ఢిల్లీ, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎన్నికైన శాసనసభ్యులు రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొంటారు. పార్లమెంట్, అ సెంబ్లీకి నామినేట్ అయిన వారికి, శాసనమండలి సభ్యులకు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉండదు. ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి మొత్తం 4,809 మంది ఉన్నారు. వారి ఓటు విలువ 10,86,431. లోక్సభ, రాజ్యసభ, శాసనసభ సభ్యులకు మాత్రమే ఈ ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది.
ఇదీ చదవండి: లోకేశ్ జూమ్ మీటింగ్ లోకి సడెన్ గా ఎంట్రీ ఇచ్చిన కొడాలి నాని, వల్లభనేని వంశీ!
MP, MLA ఓటు విలువ లెక్కింపు..
MLA ఓటు విలువ
ఎమ్మెల్యేలకు సంబంధించి రాష్ట్రాల్లో 1971 లక్కల ప్రకారం జనాభా, మొత్తం అసెంబ్లీ సీట్లను పరిగణనలోకి తీసుకుని ఈ విలువను లెక్కించారు. అప్పటికి రాష్ట్ర జనాభాను.. ఎమ్మెల్యేల సంఖ్యను వెయ్యితో మల్టిప్లై చేయగా వచ్చిన సంఖ్యనే డివైడ్ చేస్తారు. ఇలా వచ్చిన ఫలితాన్ని ఎమ్మెల్యేల సంఖ్యతో మల్టిప్లై చేసి ఈ రాష్ట్రం మొత్తం ఓటు విలువను లెక్కిస్తారు.
MP ఓటు విలువ..
ఎంపీలకు సంబంధించి దేశంలోని ఎమ్మెల్యేల మొత్తం ఓటు విలువ(5,43,321)ను మొత్తం ఎంపీల సంఖ్య(776)తో డివైడ్ చేస్తారు. ఈ మేరకు ఈ సారి ఒక్కో ఎంపీ ఓటు విలువను 700గా లెక్కించారు.
ఓట్ల లెక్కింపు..
ఓటు చెల్లుబాటు కావాలంటే తొలి ప్రాధాన్యత సంఖ్యను తప్పనిసరిగా మార్క్ చేయాలి. ప్రథమ ప్రాధాన్యత సంఖ్య వేయకుండా, ఇతర ప్రాధాన్యత నంబర్లు వేస్తే ఆ ఓటు రద్దు అవుతుంది. ఓటింగ్ మార్క్ చేయడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక పెన్ ఇస్తుంది. దాంతో మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది.
ఎంపీలు పార్లమెంటులో, ఎమ్మెల్యేలు వారి శాసనసభలో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో మరెక్కడైనా ఓటు వేయాల్సి వస్తే కనీసం పది రోజులు ముందుగా కమిషన్ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఓటింగ్లో పాల్గొనేవారు రహస్య ఓటింగ్ పాటించాలి. బ్యాలెట్ను ఎవరికైనా చూపితే ఆ ఓటు చెల్లుబాటు కాదు. బ్యాలెట్ బాక్సులు ఢిల్లీ నుంచి రాష్ట్ర రాజధానులకు వెళ్తాయి. ఓటింగ్ అనంతరం వాటిని తిరిగి ఢిల్లీకి తరలిస్తారు. రిటర్నింగ్ అధికారి సమక్షంలో ఓట్లు లెక్కిస్తారు.
ఇదీ చదవండి: ఖతర్లో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి అవమానం!
అభ్యర్థి విజయాన్ని ఎలా నిర్ణయిస్తారంటే..
పోల్ అయిన మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో 50 శాతం +1(కోటా) మొదటి ప్రాధాన్యత ఓట్లను సాధించిన అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటిస్తారు. అంటే మొదటి ప్రాధాన్యత ఓట్లు అత్యధికంగా సాధించని వారు గెలిచినట్లుగా ప్రకటిస్తారు. ఒకవేళ మొదటి ప్రాధాన్యత ఓట్ల ద్వారా అభ్యర్థి గెలుపును ప్రకటించడానికి వీలు లేకపోతే.. తరువాతి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. రాష్ట్రపతి దేశానికి ప్రథమ పౌరుడు అయినప్పటికి.. అతడు ప్రధానమంత్రి, మంత్రి మండలి సూచనల మేరకు పని చేయాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నిక విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.