తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా.. వినిపిస్తున్న పేరు “హుజూరాబాద్”. అందరికీ హుజూరాబాద్ ఉపఎన్నికే హాట్ టాపిక్. ఈ ఉపఎన్నికకు ఎందుకు ఇంత హైప్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉండి, కరోనా వేళ ఆరోగ్యశాఖ మంత్రిగా సేవలందించిన ఈటల రాజేందర్ ఎందుకు టి.ఆర్.ఎస్ నుండి బయటకు వచ్చారు? ప్రభుత్వ భూముల ఆక్రమించారంటూ ఆరోపణలు ఎందుకు వచ్చాయి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఇప్పటికీ సరైన సమాధానాలు లేవు. ఈ నేపథ్యంలో సీనియర్ జర్నలిస్ట్ జాఫర్ “బ్లాక్ & వైట్ విత్ జాఫర్” పోగ్రామ్ ద్వారా ఈ ప్రశ్నలకు సమాధానాలు తీసుకుని రావడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే జాఫర్ పై ఈటల రాజేందర్ సీరియస్ అయ్యారు.
సుమన్ టీవీ ఎక్స్ క్లూజివ్ బ్లాక్ & వైట్ విత్ జాఫర్” పోగ్రామ్ లో సీనియర్ జర్నలిస్ట్ జాఫర్.. ఈటల ముందు కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు ఉంచారు. “తెరాస నాయకులు.. ఈటల రాజేందర్ కొన్ని వేలకోట్లకు పడగలెత్తాడు. ప్రభుత్వ భూమిని ఆక్రమించాడన్న విమర్శలు చేస్తున్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చిన సమస్యని.. మొత్తం రాష్ట్ర సమస్యగా మార్చారన్న కామెంట్స్ చేస్తున్నారు. తెరాస నాయకులు చేస్తున్న ఈ మొత్తం విమర్శల్లో కొంచెం కూడా వాస్తవం లేదా” అంటూ.. తనదైన స్టయిల్ లో ప్రశ్నల వర్షం కురిపించారు జాఫర్. ఈ ప్రశ్నలకి ఈటల కూడా అంతే స్థాయిలో స్పందించారు. “ఏం ప్రశ్నలు రాసుకొచ్చారు మీరు అంటూ.. లైవ్ లోనే యాంకర్ పై ఘాటుగా స్పందించారు. ఇందుకు సంబంధించిన ఇంటర్వ్యూ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ప్రోమోనే ఈ రేంజ్ లో ఉంటే.. ఫుల్ ఇంటర్వ్యూ ఇక ఎంత వాడీవేడిగా ఉంటుందో అన్న చర్చ నడుస్తోంది. మరి.. ఈ ప్రోమోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.