ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ, బోనాల, సినిమా పాటలతో బాగా ఫేమస్ అయిన సింగర్ మంగ్లీ (‘సత్యవతి) కి సీఎం జగన్ కీలక పదవిని కట్టబెట్టారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ బోర్డ్ అడ్వైజర్ గా సింగర్ మంగ్లీని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో మంగ్లీ నెలకు రూ.1 లక్ష రూపాయల జీతం తీసుకుంటూ రెండేళ్ల పాటు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ బోర్డ్ అడ్వైజర్ పదవిలో కొనసాగనున్నారు.
ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో ప్రముఖ నటులైన ఆలీని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ గా నియమించగా, పోసాని కృష్ణ మురళిని ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ గా ఏపీ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సింగర్ మంగ్లీని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ బోర్డ్ అడ్వైజర్ గా నియమించడంతో సింగర్ మంగ్లీ సంతోషం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. సింగర్ మంగ్లీ ప్రస్తుతం తెలంగాణ పాటలతో పాటు సినిమా పాటలు కూడా పాడుతూ తెగ ఫేమస్ అయిపోయింది.