తెలుగు దేశం పార్టీకి, నందమూరి కుటుంబానికి మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. టీడీపీ స్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్. ప్రాంతీయ పార్టీల్లో కుటుంబాల హవానే కొనసాగుతుందనే విషయం అందిరికి తెలిసిందే. అలానే టీడీపీలో కూడా కుటుంబ రాజకీయాలు కొనసాగుతున్న పరిస్థితి.. కాకపోతే ఎన్టీఆర్ సంతానం కాకుండా అల్లుడు చంద్రబాబు నాయుడి పెత్తనం సాగుతోంది. పరిస్థితులు ఏవైనా కానీ.. ఎన్టీఆర్ వారసులు ఎవరు పార్టీ పగ్గాలు చేపట్టలేదు.. వాటిని చంద్రబాబు స్వాధీనం చేసుకున్నాడు. మిగతా సమయాల్లో ఎలా ఉన్నా.. ఎన్నికల వేళ మాత్రం చంద్రబాబు.. ఎన్టీఆర్ కుటుంబాన్ని బాగా వాడుకుంటారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది.
గత ఎన్నికల్లో ఇందుకు నిదర్శనాలు కూడా చూశాం. ఎన్నికల వేళ మాత్రమే చంద్రబాబుకు నందమూరి కుటుంబ సభ్యులపై ఎనలేని ప్రేమ పొంగుకువస్తుందని.. ఎన్నికలు పూర్తయ్యాక వారి వైపు కన్నెత్తి కూడా చూడరని జనాల్లో బలమైన అభిప్రాయం ఉంది. జూ. ఎన్టీఆర్ ని చంద్రబాబు ఇలానే వాడుకున్నారనే ఆరోపణ కూడా ఉంది. ప్రస్తుతం నందమూరి కుటుంబంలో బాలకృష్ణ మాత్రమే చంద్రబాబుతో సన్నిహితంగా ఉంటున్నారు. మిగతా వారు.. వారి వారి ప్రాధాన్యతలను బట్టి నడుచుకుంటున్నారు. ఇదే సమయంలో స్వర్గీయ ఎన్టీఆర్ చరిష్మాను వాడుకునేందుకు వైసీపీ అన్ని విధాలప్రయత్నం చేస్తోంది. దానిలో భాగంగా ఇప్పటికే విజయవాడ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేయడం ద్వారా నందమూరి ఫ్యామిలీ జగన్ కు జై కొడుతోంది.
ఇది కూడా చదవండి : 2024 ఎన్నికల బరిలో నారా బ్రహ్మణి! పోటీ ఖాయమా?
గుడివాడలోని నందమూరి ఫ్యామిలీ ఇటీవల సీఎం జగన్ తో భేటీ అయింది. అంతేకాదు, కృష్ణా , గుంటూరు జిల్లాల్లోని కమ్మ సంఘాలు జగన్ కు సన్మాన సభ పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ క్రేజ్ ఎంతో కొంత వైసీపీకి వెళ్లే ఛాన్స్ ఉంది. స్వర్గీయ ఎన్టీఆర్ చరిష్మా కోసం వైసీపీ వేస్తోన్న ఎత్తుగడకు చెక్ పెట్టడం కోసం చంద్రబాబు ఓ భారీ స్కెచ్ వేస్తున్నట్లు.. త్వరలో జరగబోయే మహానాడు వేదికగా దీన్ని అమలు చేయనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.
త్వరలోనే టీడీపీ మహానాడు కార్యక్రమం జరగనుంది. దాంతో పాటు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ఏడాది పాటు నిర్వహించాలని ఇప్పటికే చంంద్రబాబు నిర్ణయించారు. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా మహానాడు కార్యక్రమాన్ని జూమ్ ద్వారా నిర్వహించారు. ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో.. ఈ ఏడాది మహానాడును ఘనంగా నిర్వహించాలని.. అది కూడా హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ వేదిక మీదుగా నారా, నందమూరి కుటుంబాల మధ్య గ్యాప్ లేదనే సంకేతాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావిస్తోన్నట్లు సమాచారం. 2024 ఎన్నికల్లో వాడుకోవడానికి స్వర్గీయ ఎన్టీఆర్ చరిష్మాను పూర్తి స్థాయిలో వాడుకోవాలని బలంగా నిర్ణయించుకున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది.
ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ గెలుపు కోసం అన్ని విధాల కృషి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ.. ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఇక నందమూరి కుటుంబంలో జూనియర్ కు ప్రత్యేక అభిమాన గణం ఉంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వం, కలపుగోలుతనం, ఇతర హీరోలతో ఆయనకు ఉన్న స్నేహ బంధం కారణంగా ప్రజలకు ఎన్టీఆర్పై ప్రత్యేక అభిమానం ఉంది. జనాల్లో అభిమానం సంగతి పక్కకు పెడితే.. జూనియర్ ఎన్టీఆర్ ని మళ్లీ పార్టీలోకి తిరిగి ఆహ్వానించాలని.. టీడీపీ సీనియర్ నేతలతో పాటు కార్యకర్తలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. జూనియర్ రాకతో పార్టీలో కొత్త ఉత్సాహం నిండుతుందని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి : ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం! CBN ను కలిసిన YSR ఆత్మ!
ఈ క్రమంలో చంద్రబాబు జూనియర్ ని మహానాడుకు తీసుకువచ్చేందుకు అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు. ఇక జూనియర్ తో సహా నందమూరి కుటుంబ సభ్యులంతా మహానాడు వేదికపై కనిపించేలా చేసేందుకు బాబు ప్రయత్నాలు మొదలు పెట్టారు. చంద్రబాబు ప్రయత్నాలు ఫలించి జూనియర్ మహానాడుకి హాజరవుతారా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.