ప్రధాని మోదీ క్యాబినేట్ లో ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతరామాన్ ప్రత్యేక గుర్తింపు సంపాందించింది. నిత్యం ఆర్థికపరమైన అంశాల మీద విస్తృత్తంగా అధికారులతో చర్చలు జరిపి. వారిని పరుగులు పెట్టిస్తుంది. ఇలాంటి పవర్ ఫుల్ మినిస్టర్ చేసిన ఓ పని అందరిని ఆకట్టుకుంది. కేంద్ర మంత్రి అయివుండీ.. అలా చేయడం గ్రేట్ అంటూ ప్రశంసించారు. ఇంతకి ఆమె చేసిన పని ఏమిటి అనే కదా! సందేహం. ఓ అధికారికి ప్రసంగం మధ్యలో నిర్మలా సీతారామన్ మంచి నీళ్లను అందించారు. తన హోదాను పక్కనబెట్టి మరీ ఆమె అలా చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే..
నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్(NSDL)సంస్థ.. సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా విద్యార్థుల కోసం ముంబయి లోని ఓ హోటల్ లో అవగాహన సదస్సు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సదస్సులో అనేక మంది ఆర్థిక నిపుణులు ప్రసంగించారు. అదే క్రమంలో NSDL ఎండీ పద్మజ చుండూరు ప్రసంగిస్తున్నారు. మధ్యలో ఆమె ఓ గ్లాస్ వాటర్ ఇవ్వమని పక్కన సిబ్బందికి తెలిపింది. అయితే అదే వేదికపై ఉన్న నిర్మలా సీతారామన్ కుర్చిలో నుంచి లేచి వచ్చి స్వయంగా గ్లాస్ లో నీరు పోసి పద్మజ గారికి అందించారు. దీంతో ఈ అక్కడ ఉన్నవారంతా నిర్మలా సీతారామన్కు అభినందిస్తూ చప్పట్ల కొట్టారు.తనకు స్వయంగా కేంద్ర మంత్రి స్వయంగా నీళ్లు సీసాను అందించడంపై పద్మజ చుండూరు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెటిజన్ల నుంచి నిర్మలా సీతారామన్ కి ప్రశంసల వర్షం కురుస్తోంది. “ఇది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విశాల హృదయం, వినయం, విలువలను ప్రతిబింబిస్తుంది..ఈ రోజు ఇంటర్నెట్లో మనసుకు హత్తుకునే వీడియో ఇది” అంటూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
This graceful gesture by FM Smt. @nsitharaman ji reflects her large heartedness, humility and core values.
A heart warming video on the internet today. pic.twitter.com/isyfx98Ve8
— Dharmendra Pradhan (@dpradhanbjp) May 8, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.