డీకే అరుణ..ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో ఓ కీలక నేతగా కొనసాగుతున్నారు. ఇక గతంలో కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలుగిన అరుణ గద్వాల నియోజకవర్గం నుంచి రెండు సార్లు వరసగా ఎమ్మెల్యేగా గెలిచి స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో చిన్నతరహా పరిశ్రమల శాఖామంత్రిగా పని చేశారు. ఇక సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మహిళా నేతగా డీకే అరుణ కాంగ్రెస్లో తన మార్క్ రాజకీయాలతో ప్రజల్లో మంచి నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు. అయితే కొన్ని కారణాలతో ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు.
దీంతో ఆ పార్టీ డీకే అరుణపై నమ్మకంతో ఏకంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్ష పదవిని కట్టబెట్టారు. ఈ క్రమంలో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే పదవిని అందుకున్న అరుణ బీజేపీలో కూడా తన రాజకీయ పంథాను కొనసాగిస్తోంది. దీంతో పాటు తెలంగాణ బీజేపీలో కీలక నేతగా వ్యవహరిస్తూ పార్టీకి కోసం అహర్నిశలు పోరాడుతోంది. అయితే తాజాగా డీకే అరుణ సుమన్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో తన రాజకీయ ప్రస్థానం గురుంచే కాకుండా తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలనపై తన పెదవి విప్పారు.
మీ రాజన్న కుమారుడిగా ఏపీలో జగన్ పరిపాలన గురుంచి మీరు ఏం చెబుతారని యాంకర్ అడగగానే… జగన్ తన తండ్రి ఆశయాన్ని కొనసాగించేందుకు తన వంతు ప్రయత్నాన్ని చేస్తున్నాడు . గట్టి నమ్మకంతో పాదయాత్ర చేసి ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకున్నాడని, ఏపీలో ఏ ఎన్నికలు జరిగినా అన్ని స్థాయిల్లోనూ గెలుచుకుంటు వెళ్తున్నాడని తెలిపింది. ఇక ఇప్పటికి రెండున్నర సంవత్సరాల పరిపాలనలో బాగానే చేశాడని తెలుస్తోంది. ఇంకా రెండున్నర సంవత్సరాల కాలం ఉంది గనుక ఇంకా ఎలాంటి పరిపానల చేస్తారనేది చూడాలని తెలిపింది అరుణ.