ఏపీ రాజకీయాల్లో కీలక పరిణమాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల ఏపీలో పార్టీ పెడతానని తెలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఓ షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏపీలో బ్రదర్ అనిల్ కొత్త పార్టీ పెట్టనున్నారనే వార్తలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. బ్రదర్ అనిల్ సారథ్యంలో కొత్తగా నేషనల్ పార్టీ రాబోతుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే బ్రదర్ అనిల్.. బీసీ, మైనార్టీ, క్రిస్టియన్ అసోసియేషన్ నేతలతో సమావేశం అయ్యారు. ఈ మీటింగ్ లో ప్రధానంగా ఇదే అంశాన్ని చర్చించినట్లు తెలుస్తోంది.
బ్రదర్ అనిల్తో ఏపీలోని వివిధ సంఘాల నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక విషయాలపై చర్చలు జరిపారు. బ్రదర్ అనిల్ చెప్పడం వల్లే గత ఎన్నికల్లో తామంతా జగన్కు సపోర్ట్ చేశామని.. ఇప్పుడు సీఎం బీసీలను పట్టించుకోవడం లేదని బీసీ సంఘం నేతలు అసంతృప్తి వ్యకం చేశారు. జగన్ సీఎం అయ్యాక రెండేళ్లుగా కలిసేందుకు తమకు సమయం కూడా ఇవ్వలేదని.. ఎన్నో బాధలు పడుతున్నామని వారు అనిల్తో చెప్పుకున్నామని తెలిపారు. ఎస్సీలకు సబ్ ప్లాన్ నిధులు కూడా ఇవ్వడం లేదని వాపోయారు. ఏపీలో కొత్త పార్టీ పెట్టాలని బ్రదర్ అనిల్ను బీసీ నేతలు కోరారు. అవసరమైతే జాతీయ పార్టీ పెట్టాలని రిక్వెస్ట్ చేశారు. ఏ నిర్ణయం తీసుకున్నా వెంటే ఉంటామని వివిధ సంఘాల నేతలు బ్రదర్ అనిల్కు తెలిపారు. ఈ అంశంపై బ్రదర్ అనిల్ఏం చెబుతారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. బ్రదర్ అనిల్ ఏపీలో కొత్త పార్టీ పెట్టనున్నారనే దానిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.