దివంగత ఏపీ పారిశ్రామిక శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే లేదా ఎంపీలు ఎవరైనా మరణిస్తే ఖాళీ అయిన ఆ స్థానం నుంచి మరణించిన వారి కుటుంబసభ్యులను నిలబెట్టే సాంప్రదాయం ప్రస్తుతం ఏపీలో కొనసాగుతోంది. ఆయా పార్టీలు ఈ పద్ధతినే మరణించిన వారికి ఇచ్చే గౌరవంగా భావిస్తున్నాయి. పక్క పార్టీలు కూడా దీనికి మద్దతునిస్తున్నాయి. వైఎస్సార్ సీపీ ఈ ఉప ఎన్నికల్లో గౌతమ్ రెడ్డి నియోజకవర్గమైన ఆత్మకూరునుంచి ఆయన భార్య శ్రీ కీర్తి రెడ్డిని పోటీ చేయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఈ నిర్ణయానికి మద్దతు తెలిపినట్లు సమాచారం. ఆమెకు ఎమ్మెల్యే సీటు ఇవ్వటంతో పాటు, గెలిచిన తర్వాత ఆమెను కేబినెట్లోకి తీసుకోని మంత్రి పదవి కేటాయించనున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. గౌతమ్ రెడ్డికి ఓ కుమారుడు ఉన్నప్పటికి అతడు వయసులో చిన్నవాడవటం, పైగా రాజకీయాలపై అతడికి ఆసక్తి లేకపోవటంతో శ్రీ కీర్తి రెడ్డికే సీటు కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. త్వరలో ఈ మేరకు పార్టీనుంచి ప్రకటన కూడా వెలువడనుంది. దీనికి ముందు గౌతమ్ రెడ్డి భార్య శ్రీ కీర్తి రెడ్డి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని పార్టీ భావిస్తోంది. ఆ తర్వాతే దీనిపై ప్రకటన వెలువడనుంది.
శ్రీ కీర్తి రెడ్డిది ఏకగ్రీవమా?..లేక పోటీ తప్పదా?..
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో శ్రీ కీర్తి రెడ్డికి పార్టీ సీటు కేటాయిస్తే వందకు 99 శాతం ఏకగ్రీవం అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కానీ, మిగిలిన ఒక శాతంలో క్లారిటీ లేదు. ఏపీలో ప్రధాన పార్టీలైన టీడీపీ, జనసేనలు ఇంతకు ముందు ఫాలో అయిన రూల్నే ఇప్పుడు కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది. తమ పార్టీ తరుపునుంచి ఎవరినీ పోటీ దించకపోవచ్చు కూడా. అయితే, బీజేపీ నుంచి పోటీ ఉంటుందా? ఉండదా? అన్నది క్లారిటీ లేదు. గతంలో టీడీపీ, జనసేన పోటీనుంచి తప్పుకున్నా బీజేపీ పోటీలో నిలబడిన దాఖలాలు ఉన్నాయి. ఒక వేళ బీజేపీ పోటీలో నిలబడ్డా గెలుపు శ్రీ కీర్తి రెడ్డిదే అని చెప్పటంలో ఎలాంటి డౌటు లేదు. ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.