ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. కానీ ప్రతిపక్షాలు, విపక్షాలు ఇప్పటి నుంచే ఢీ అంటే ఢీ అన్నట్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మరో వైపు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో.. ప్రతిపక్షాలు.. సందర్భం వచ్చిన ప్రతి సారి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్షాలపై సీఎం జగన్ విరుచుకు పడ్డారు. శ్రీకాకుళంలో అమ్మఒడి పథకం మూడో విడత డబ్బులు జమ చేసిన అనంతరం ప్రసంగించిన సీఎం.. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు కొన్ని మీడియా సంస్థలపై మండిపడ్డారు. తాను కేవలం చంద్రబాబుతో మాత్రమే పోరాటం చేయటం లేదని.. మారీచులతో.. కుట్రలు -కుయుక్తులు పన్నే వారితో యుద్ధ చేస్తున్నానన్నారు జగన్. వీరంతా కలిసినా తన వెంట్రుక కూడా పీకలేరు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారితో యుద్దానికి తాను సిద్దమేనని.. ప్రజల మద్దతే తనకు బలమని స్పష్టం సీఎం చేశారు. జగన్ ఒక్కడే ఇంత మందితో యుద్దం చేస్తున్నాడని.. మీ అందరి మద్దతు ఉందనే నమ్మకంతోనే ముందుడుగు వేస్తున్నానని సీఎం జగన్ అన్నారు.
అమ్మఒడిపై విమర్శలు చేస్తున్నవారికి గతంలో పిల్లలను చదవిస్తున్న తల్లులకు ఒక్కరూపాయి ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందా అని ప్రశ్నించారు. రూపాయి సాయం చేయకపోగా.. విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. అలాగే ఈసారి 51 వేల మంది లబ్ధిదారులను తొలగించడంపైనా సీఎం వివరణ ఇచ్చారు. విద్యార్థులకు 75శాతం హాజరు లేకపోవడం వల్లే 51 వేల మందిని తొలగించామని తెలిపారు. ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని.., అమ్మఒడి పేరుతో ఎవరికీ ఎగ్గొట్టే ఉద్దేశం తనకు లేదని క్లారిటీ ఇచ్చారు. తాము 51 వేల మందికి ఇవ్వలేకపోతున్నామని కారణం చెబుతూనే.. ఎందుకు పాఠశాలలు – మరుగుదొడ్ల నిర్వహణ కోసం రెండు వేలు మినహాయిస్తున్న విషయాన్ని చెప్పి మరీ నిధులు అందిస్తున్నామని జగన్ వివరించారు.
ఇది కూడా చదవండి: ఆస్పత్రిలో డీజే పాటలకు సిబ్బంది స్టెప్పులు.. వైద్యం అందక తల్లి కడుపులోనే శిశువు మృతి!
పథకాల అమలు విషయంలో నిజం చెప్పై నిజం చెప్పే ధైర్యం ప్రతిపక్షాలకు ఉందా అంటూ జగన్ నిలదీసారు. మేనిఫెస్టోలో చెప్పిన 95 శాతం వాగ్దానాలు మూడేళ్లలో అమలు చేసామన్నారు. డబ్బులు ఉన్న వారి పిల్లలకే అందుబాటులో ఉన్న బైజూస్ తో ఒప్పందం చేసుకున్నామన్నారు. పేద పిల్లలకు నాణ్యమైన చదువులు అందిస్తుంటే కొందరు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. డబ్బులు ఎగ్గొట్టె నైజమే ఉంటే ఇలాంటి పథకం అమలు చేయాలన్న ఆలోచనే చేసేవాళ్లం కాదన్నారు. జగన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: నన్ను చదివించండి సర్.. బాలుడి కన్నీళ్లు చూసి చలించిపోయిన మంత్రి శ్రీనివాస్ గౌడ్