ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి పేరు మారు మ్రోగిపోతోంది. నిన్న మొన్నటి వరకు పట్టాభి అంటే రాజకీయాలను ఫాలో అయ్యే వారికి మాత్రమే తెలుసు. కానీ.. సాక్ష్యాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషించి పట్టాభి వార్తల్లో వ్యక్తి అయ్యాడు. పట్టాభి ముఖ్యమంత్రిని ఆ పదజాలంతో దూషించడంతో వైసీపీ కార్యకర్తలు హద్దు మీరు ప్రత్యక్ష దాడులకు తెగబడ్డారు. ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు 36 గంటల నిరవధిక దీక్ష చేపట్టారు. మరోవైపు ఈ దీక్షకి పోటీగా వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా జనాగ్రహ దీక్షలు చేపట్టారు. ఈ దీక్ష కేంద్రంగా పట్టాభిపై ఓ యువతి సంచలన కామెంట్స్ చేసింది.
అధికారంలో లేమన్న బాధతో, జగన్ మోహన్ రెడ్డి సీఎంగా అందిస్తున్న మంచి పరిపాలన చూసి ఓర్వలేక టీడీపీ వారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు పట్టాభి.. హైలెట్ అవ్వడానికి సీఎం జగన్ ని బూతులు తిడుతున్నాడు. కానీ.., పట్టాభి గతం అంతా నాకు తెలుసు. పట్టాభి 1997 ఐ.హెచ్.ఎమ్ లో హోటల్ మేనేజ్మెంట్ చేశాడు. ఆ సమయంలో నార్త్ అబ్బాయిని లైంగికంగా వేధించాడు. అప్పుడే కాలేజీ యాజమాన్యం అతన్ని సస్పెండ్ చేసింది. పట్టాభి ఒక గే. పట్టాభి సస్పెండ్ అయిన సమయంలో పట్టాభి తండ్రిగా చలసాని ఆజాద్ అనే వ్యక్తి కాలేజీకి వచ్చాడు. ఇప్పుడు అతని తండ్రి పేరు కొమ్మారెడ్డి పట్టాభి అని ఉంది. ఇతని తండ్రి విషయంలో కూడా క్లారిటీ లేదు. ఇలాంటి వ్యక్తి సీఎం జగన్ మోహన్ రెడ్డిపై కామెంట్స్ చేస్తాడా అంటూ ఆ యువతి రెచ్చిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం విశేషం. మరి.. ఈ యువతి కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.