ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం మాత్రం ఉండగానే.. కేంద్ర ఎన్నికల సంఘం పలు పార్టీలకు భారీ షాకిచ్చింది. యాక్టీవ్గా లేని రాజకీయ పార్టీలపై వేటు వేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా నమోదిత గుర్తింపులేని 86 పార్టీలను ఈసీఐ జాబితా నుంచి తొలగించింది. అంతేకాక దేశవ్యాప్తంగా 253 ఉనికిలో లేని క్రియారహిత రాజకీయ పార్టీలున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఇప్పటివరకు ఉనికిలోలేని పార్టీల సంఖ్య 537కి చేరిగా.. ఎన్నికల సంఘం జాబితా నుంచి తొలగించిన నమోదిత గుర్తింపులేని పార్టీల సంఖ్య 284కు చేరింది. ఈ క్రమంలో ఏపీలో ఆరు, తెలంగాణలో రెండు నమోదిత గుర్తింపులేని రాజకీయ పార్టీలను ఈసీఐ జాబితా నుంచి తొలగించింది. ఈ జాబితాలో కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ కూడా ఉంది. ఒక పార్టీ రిజిస్టర్ అయ్యాక ఐదేళ్లలోపు ఎన్నికల సంఘం నిర్వహించే ఎన్నికల్లో పోటీచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పోటీ చేస్తూనే ఉండాలి. పార్టీ ఆరేళ్లపాటు ప్రతి ఎన్నికల్లో పోటీచేయకపోతే రిజిస్టర్డ్ పార్టీల జాబితా నుంచి దాని పేరును తొలగిస్తారు. ఈ క్రమంలో ఏపీలో ఈసీఐ జాబితా నుంచి తొలగించిన పార్టీల విషయానికి వస్తే.. ఆలిండియా ముత్తాహిదా ఖ్వామీ మహాజ్, భారత్దేశం పార్టీ, ఇండియన్స్ ఫ్రంట్, జాతీయ తెలుగు అభివృద్ధి సేవాసమూహం, మన పార్టీ, ప్రజాభారత్ పార్టీలు ఉన్నాయి.
అలానే కేఏ పాల్ స్థాపించిన ప్రజాశాంతి పార్టీకి కూడా ఈసీ భారీ షాకిచ్చింది. క్రియాశీలకంగా లేని పార్టీల జాబితాలో ప్రజాశాంతి పార్టీని చేర్చింది. యాక్టివ్గా లేని పార్టీలకు కామన్ సింబల్ నిలిపివేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. కేఏ పాల్.. 2008లోనే ప్రజా శాంతి పార్టీని రిజిస్టర్ చేయించారు. ఈ క్రమంలో ఈసీ ఆ పార్టీకి హెలికాప్టర్ గుర్తును కేటాయించింది. ఆ తర్వాత 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా శాంతి పార్టీ తరపున 11 మంది పోటీ చేవారు.. కానీ ఓడిపోయారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు. కేఏ పాల్ నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేశారు. కానీ అందరూ ఓడిపోయారు. ఇక కొద్దిరోజుల క్రితం తెలంగాణలో కూడా ప్రజాశాంతి పార్టీని యాక్టీవ్ చేస్తామని కేఏ పాల్ ప్రకటించాడు. ఈలోపే ఈసీ ఆ పార్టీకి భారీ షాకిచ్చింది. ప్రజాశాంతి పార్టీని క్రియాశీలకంగా లేని పార్టీల జాబితాలో చేర్చింది. మరి దీనిపై ఈ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.