ఏపీలో ముందస్తు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా విపక్ష నేత చంద్రబాబు నాయుడు ఏడాది క్రితం నుంచే ముందస్తు ఎన్నికలు వస్తాయని కేడర్ కు చెబుతూ వస్తున్నారు. 2022లోనే ఎన్నికలు వస్తాయి అంటున్నారు. బాబు అంచనాలకు తగ్గట్లే ఈ ఏడాది ఎన్నికలు వచ్చాయి అనుకుందాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి ఎన్నికలను ఎదుర్కొగల నేతలు ఉన్నారా అనేది ప్రసుత్తం ఆ పార్టీ ముందున్న అతి పెద్ద సవాలు. అసలు రాష్ట్రంలో ప్రస్తుతం టీడీపీ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం.
ప్రతిపక్షంలో ఉన్నప్పటికి టీడీపీకి కేడర్ ఉంది.. అనుకూల మీడియా ఉంది.. రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఆ పార్టీకి స్థానం ఉంది. ఇవన్ని వాస్తవాలే. అయితే నియోజకవర్గాల వారిగా చూస్తే.. చాలా చోట్ల పార్టీకి ఇంచార్జిలు కరువయ్యారు. కేడర్ ఉన్నా.. బలమైన నేతలు లేకపోవడంతో.. పార్టీ నిస్తేజంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రాయలసీమలో పార్టీ ఇంచార్జులు ఎవరో కూడా తెలియదు. సీమలో టీడీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ 2019 ఎన్నికల ఫలితాల తర్వాత వారిలో చాలామంది కేడర్ కు దూరం అయ్యారు. ప్రజలతో సంబంధాలను తెంచేసుకున్నారు. గత ఎన్నికల్లో ప్రజలు టీడీపీని చిత్తుగా ఓడించారు. ఫలితంగా ప్రతిపక్షంలో ఉన్నా.. పార్టీ ఉనికిని కాపాడే నేతలు కరువయ్యారనే టాక్ వినిపిస్తోంది.
ఇది కూడా చదవండి : తారక్ కోసం తగ్గిన చంద్రబాబు! టీడీపీ మహానాడుకి జూనియర్ యన్టీఆర్!
పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు టీడీపీలో ఉండి ఉంటే.. పార్టీ ఉనికి నిలిచేది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే టీడీపీలోని మహామహులు ఓడటం, కంచుకోటలు బద్దలయిన ప్రభావం పార్టీపై ఇప్పటికి ఉంది. వచ్చే ఎన్నికల్లో కూడా ఇది ప్రభావం చూపుతుంది అంటున్నారు విశ్లేషకులు. రాయలసీమలో టీడీపీకి భవిష్యత్తులో దిక్కుతోచని స్థితిలో ఉన్న నియోజకవర్గాల్లో కుప్పం ముందు స్థానంలో ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో.. ఇన్నాళ్లు ఇది టీడీపీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది. అయితే 2019 ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో పరిస్థితి పూర్తిగా మారింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
కుప్పంలో పోటీ చేయలేని పరిస్థితి
కుప్పంలో టీడీపీ పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యిందని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం లేదని తెలుగు తమ్ముళ్లు జోరుగా చర్చించుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకునేందుకు టీడీపీ సర్వశక్తులు ఒడ్డింది. చంద్రబాబు నాయుడు, లోకేష్, పార్టీ మహామహులంతా టీడీపీ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డినప్పటికి ప్రయోజనం లేకపోయింది. కుప్పంలో టీడీపీ చిత్తుగా ఓడిపోయింది.. వైసీపీ గెలిచింది.
ఇది కూడా చదవండి : కడపలో బలపడుతున్న టీడీపీ! జగన్ లెక్క తప్పిందా?
తను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోవడం చంద్రబాబుకు భారీ షాక్ అనే చెప్పవచ్చు. ఇలాంటి నేపథ్యంలో కుప్పంలో టీడీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ఇలాంటి తరుణంలో వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు పోటీ చేస్తే.. ఆయన పరిస్థితి ఎదురీదినట్లే ఉంటుంది అంటున్నారు విశ్లేషకులు. ప్రచారం చేయకుండానే గెలిచిన రోజులు పోయి.. రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో ప్రచారం పక్కన పెట్టి.. కుప్పంలో గెలుపు కోసం కృషి చేయాల్సిన పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితిలో చంద్రబాబు కుప్పానికి దండం పెట్టి.. వేరే నియోజకవర్గం నుంచి పోటీచేయాల్సి వస్తుంది అంటున్నారు విశ్లేషకులు. ఇదే జరిగితే.. టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లే అంటున్నారు. కుప్పంలో గెలుపుపై చంద్రబాబుకే నమ్మకం లేక.. వేరు చోట నుంచి పోటీ చేస్తే.. అది కేడర్ కు వేరే సంకేతాలు ఇస్తుంది. రాష్ట్రంలో టీడీపీ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి వస్తుంది అంటున్నారు విశ్లేషకులు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.