26/11 ముంబై దాడుల నేపథ్యంలో తెరకెక్కిన మేజర్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. అడవి శేష్ ప్రధాన పాత్రలో శశి కిరణ్ తిక్కా తెరకెక్కించిన మేజర్ సినిమా జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలై.. ప్రేక్షకుల మన్ననలు పొందింది. అప్పటి నుంచి మేజర్ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందని ఎంతో మంది అభిమానులు ఎదురుచూశారు. అయితే ఆ రోజు రానే వచ్చింది. ఈ సినిమా జులై 3 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ ఇండియా తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది.
26/11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన వీర జావాన్ మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ బయోపిక్ గా తెరకెక్కింది. సైనికుడిగా సందీప్ ఉన్ని కృష్ణన్ చేసిన త్యాగం మాత్రమే కాకుండా.. అతని బాల్యం ఎలా గడించింది? అసలు జవాను ఎందుకు కావాలనుకున్నాడు? ఈ క్రమంలో ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డాడు? వంటి అంశాలను డైరెక్టర్ స్పష్టంగా తెరకెక్కించాడు. ఈ సినిమా ఒక్క తెలుగు ప్రేక్షకులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిలో స్ఫూర్తి నింపింది. మేజర్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
The hero you know, the story you don’t.#Major is coming to Netflix on 3rd July in Telugu, Hindi and Malayalam!#MajorOnNetflix pic.twitter.com/qZ9OxDqToE
— Netflix India (@NetflixIndia) June 30, 2022