ఇటీవల కాలంలో థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలన్నీ కొద్దిరోజులకే ఓటిటిలో స్ట్రీమింగ్ బాటపడుతున్నాయి. స్టార్ హీరోల సినిమాలు మొదలుకొని యంగ్ హీరోల వరకూ అందరి సినిమాలు థియేట్రికల్ రిలీజ్ తర్వాత నెల రెండు నెలల వ్యవధిలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్నాయి. అయితే.. ప్రేక్షకులు కూడా ఈ మధ్య థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలను కాకుండా.. ఆ సినిమా ఓటిటిలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే.. లాక్ డౌన్ టైం నుండే ఆడియెన్స్ అంతా ఓటిటిలకు బాగా అలవాటు పడిపోయారు. అదీగాక సినిమాల టాక్ బట్టి థియేటర్స్ లో చూసేందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు జనాలు.
ఈ క్రమంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన తమిళ హీరో ఆర్య నటించిన ‘కెప్టెన్’ మూవీ.. థియేటర్స్ లో విడుదలైన మూడు వారాలకే ఓటిటిలో స్ట్రీమింగ్ కి రాబోతుండటం గమనార్హం. ఆర్య గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. వరుడు మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ఆర్య.. రాజారాణి మూవీతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఆ తర్వాత సైజ్ జీరోతో పాటు పలు డబ్బింగ్ సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే.. గతేడాది ‘సర్పట్ట పరంపర’ మూవీ సక్సెస్ తర్వాత మరో హిట్ కోసం ట్రై చేస్తున్నాడు. కానీ.. ఆ తర్వాత వచ్చిన అరణ్మణై-3, ఎనిమి సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్నా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి.
ఇక ఇటీవల సైన్స్ ఫిక్షన్ జానర్ లో కెప్టెన్ మూవీ చేశాడు. దాదాపు 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. సెప్టెంబర్ 8న తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది. అయితే.. బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. కలెక్షన్స్ పరంగా భారీ నష్టాలను చవిచూసింది. దీంతో చేసేది లేక మూడు వారాలకే ఓటిటిలో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. అదీగాక ఈ సినిమాను నిర్మాత టి. కిషోర్ తో కలిసి ఆర్య కూడా నిర్మించడం విశేషం. 1987లో వచ్చిన హాలీవుడ్ ‘ప్రిడేటర్’ నుండి ఇన్స్పైర్ అయ్యి కెప్టెన్ మూవీ తీశారు. ఇదిలా ఉండగా.. కెప్టెన్ మూవీ ఓటిటి హక్కులను జీ స్టూడియోస్ వారు సొంతం చేసుకున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 30 నుండి ‘జీ5’లో స్ట్రీమింగ్(తెలుగు, తమిళ భాషల్లో) చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మరి కెప్టెన్ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#Captain OTT RELEASE September 30 @ZEE5India pic.twitter.com/lnHBo9cSQZ
— OTTGURU (@OTTGURU1) September 21, 2022