దసరాకి మరికొన్ని రోజులు మాత్రమే ఉంది. ఇక సినిమాల పరంగా ఎవరికి వాళ్లు.. అప్డేట్స్ సిద్ధం చేసుకుంటున్నారు. ఇక ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లోనూ పలు కొత్త సినిమాలు అలరించేందుకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలోనే అనసూయ ‘దర్జా’ సినిమా కూడా ఓటీటీలో విడుదల చేయనున్నట్లు ఆహా ట్వీట్ చేసింది. మాస్ కథతో తీసిన ఈ సినిమాలో అనసూయతో పాటు సునీల్.. కీలకపాత్రల్లో నటించారు. ‘పుష్ప’ తర్వాత వీరిద్దరూ కలిసి చేసిన ఈ చిన్న సినిమా తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపింది. దీంతో పాటు ట్రైలర్ లో అనసూయ మాస్ గెటప్ లో కనిపించడం కూడా ‘దర్జా’ ప్రీ రిలీజ్ బిజినెస్ కి ప్లస్ అయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘దర్జా’ మూవీలో అనసూయ కనకం అనే సారా వ్యాపారిగా నటించింది. తనకు అడ్డొచ్చిన పోలీసులను హతమార్చే డిఫరెంట్ పాత్రలో కనిపించి మెప్పించింది. ఓ మూగ ప్రేమికుడి హత్య కేసులో కనకానికి, శివశంకర్ అనే పోలీసు అధికారికి మధ్య జరిగిన స్టోరీనే ‘దర్జా’ సినిమా స్టోరీ. దీనిని సలీమ్ మాలిక్ అనే దర్శకుడు తెరకెక్కించారు. అయితే రిలీజ్ కి ముందు బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఫెయిలైంది. నెగిటివ్ టాక్ రావడంతో.. తొలి వారం కాకముందే ‘దర్జా’ని థియేటర్స్ నుంచి తీసేశారు.
Dussehra rangam lo ki diguthunna#UnikiOnAHA And #DarjaOnAHA. Pandaga adhiripoddhi🔥
Premieres October 5. @itsashishgandhi @Chitrashukla73 @bobby_yedida @prmusicdirector @bobburi_rajesh @RajkumarBobbby @Haricinemas @saradaa_syam @anusuyakhasba @Mee_sunil @OfficialSekhar pic.twitter.com/3F74uphvCP— ahavideoin (@ahavideoIN) October 1, 2022
రెగ్యులర్ గా అనసూయ గ్లామర్ షోతో అలరిస్తూ ఉంటుంది. అలాంటిది ఈ సినిమాలో నెగిటివ్ గా చీరకట్టులో కనిపించింది. దానికి తోడు ఆమె పాత్ర నిడివి కూడా చాలా తక్కువగా ఉండటం, ఆమె అభిమానుల్ని డిసప్పాయింట్ చేసింది. ఇక థియేటర్ లో రిలీజ్ కి ముందే డిజిటల్ రైట్స్ దక్కించుకున్న ఆహా ఓటీటీ.. తాజాగా విడుదల తేదీని ప్రకటించింది. దసరా సందర్భంగా అక్టోబరు 5న స్ట్రీమింగ్ చేయనున్నామని ట్వీట్ చేసింది. ఇందులో అనసూయ, సునీల్ తో పాటు ఆమని, పృథ్వీ, షకలక శంకర్ తదితరులు నటించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ‘పుష్ప 2’, ‘రంగమార్తండ’ సినిమాల్లో కీ రోల్స్ చేస్తోంది. మరి అనసూయ ‘దర్జా’ మూవీ కోసం మీలో ఎంతమంది ఎదురుచూస్తున్నారు. మీ ఒపినియన్ కామెంట్స్ లో పోస్ట్ చేయండి.