హైదరాబాద్లో వైఎస్ విజయమ్మ ఆత్మీయ సమ్మేళనానికి హాజరుకావాల్సిందిగా ఆహ్వానించబడిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్తో తనకున్న అనుబంధం గురించి, ఆయన రాజకీయ ఎజెండా గురించి మాట్లాడారు. ప్రస్తుతం చర్చించబడుతున్న వైఎస్ఆర్ సంక్షేమ కార్యక్రమం మరియు పాలన జ్ఞాపకార్థం ఈ సమావేశాన్ని నిర్వహించామని ఆయన అన్నారు. 1983 లో ఇందిరాగాంధీ మరియు రాజీవ్ గాంధీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఎలా కలిశారో ఉండవల్లి అరుణ్ కుమార్ వివరించారు. మాజీ కాంగ్రెస్ ఎంపీ 1983 నుండి 2009 వరకు, ఆయన మరణించే వరకు వైఎస్ఆర్ని ఎలా కీర్తించారో వెల్లడించారు. రాజశేఖర్ రెడ్డి సంస్మరణ సభ కొన్ని ప్రత్యేకతల సమాహారం. ఈ సందర్భంగా ఆయనతోఎంతో అనుబంధం ఉన్న నేత, మాజీ ఎం.పీ అరుణ్ కుమార్ స్పందించారు.
కమ్యూనిస్టు భావజాల ఆవంత్స సోమసుందర్ – జీవితం అంతా వారి కవిత్వం వారి ప్రయాణం అన్నీ అన్నీ పేదల కోసమే. వజ్రాయుధం అనే కవితా సంకలనం రాసి ప్రభుత్వాల కోపం చూశాడు. నిషేధిత సాహిత్యంగా చెలామణి అయింది. అలాంటి కమ్యూనిస్టు వాది ఆవంత్స ఓ సందర్భంలో నాతో వై.ఎస్. అసంపూర్తిగా చనిపోయారు అని అన్నారు. మన కమ్యూనిస్టులు సంకల్పించారు. ప్రారంభించలేకపోయారు. పేదలకు ఇళ్లు అందించే విషయమై ఆయన సాధించారు. అని అంటూ రాజశేఖర్ రెడ్డి ఫొటో చూపించారు. ఇప్పుడు మనం ఆయన ప్రారంభించిన పనులు కొనసాగింపు ఇవ్వాలని సంకల్పించుకుందాం అంటూ ఉండవల్లి అరుణ్ ప్రసంగించారు. ఈ ప్రసంగం అంతా వింటోన్న వైఎస్సార్ సతీమణి విజయమ్మ చెమరించిన కళ్లని ప్రతీఒక్కరూ చూడొచ్చు.
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ హైదరాబాద్లో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వైఎస్ క్యాబినెట్లో పనిచేసిన మంత్రులు, రాజకీయ సహచరులను విజయమ్మ ప్రత్యేకంగా ఆహ్వానించారు.