ఈ మధ్య కాలంలో కొందరు తాము చేసిన తప్పు నుంచి తప్పించుకోవడం కోసం చావు తెలివితేటలు ప్రదర్శిస్తుంటారు. వారి ప్రయత్నాలు విఫలమై చివరికి దొరికిపోతారు. తాజాగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసునుంచి తప్పించుకోవటానికి ఓ మహిళ మాస్టర్ ప్లాన్ వేసింది. తన చావును తానే సృష్టించుకుని, డెత్ సర్టిఫికేట్కు అప్లై చేసుకుంది. చివరకు ప్లాన్ ఫేయిల్ అయి జైలు పాలైంది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్లోని లండన్కు చెందిన జోయ్ బెర్నార్డ్ అనే 38 ఏళ్ల మహిళ 2019లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి పోలీసులకు దొరికింది. అప్పుడు 12 నెలల డ్రైవింగ్ బ్యాన్, ఆరు నెలల కర్ఫ్యూ విధించారు. అయితే ఆమె తనపై ఉన్న బ్యాన్ను లెక్క చేయకుండా డ్రైవింగ్ చేయటం మొదలుపెట్టింది. దీంతో 2020లో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
ఈ నేపథ్యంలో పోలీసులనుంచి తప్పించుకోవటానికి బెర్నార్డ్ ఓ పథకం వేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్ట్ అయింది తాను కాదని, తన లాగే ఉన్న తన చెల్లెలు క్యేసా బెర్నార్డ్ అని వారితో చెప్పింది. ఆమె కొంతకాలం క్రితమే చనిపోయిందని కూడా చెప్పింది. దీంతో పోలీసులు ఆమెను వదిలేశారు. కేసు నుంచి బయటపడ్డానికి బెర్నార్డ్ తన ప్లాన్ను మరింత పగడ్బందీ చేసింది. ఈ సారి డెత్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసింది. అయితే, ఆమె ఇచ్చిన ఆధారాలు సరిగా లేకపోవటంతో డెత్ సర్టిఫికేట్ రాలేదు. ఫేక్ డెత్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసినందుకు ఆమెపై కేసు నమోదైంది. బెర్నార్డ్ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు.
దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఆమె దోషి అని తేలటంతో 8నెలల జైలు శిక్ష విధించింది. కాగా, కొద్దినెలల క్రితం శాండియాగోకు చెందిన మైరా అలోంజో అనే మహిళ ఇలానే బ్రతికుండగానే తన అంత్యక్రియలను తానే నిర్వహించుకుంది. శవ పేటికలో కొన్ని గంటల పాటు పడుకుంది. అంతేకాదు! తన బంధువులు, స్నేహితులను సైతం ఈ అంత్యక్రియలకు ఆహ్వానించింది. వారు కూడా ఈ అంత్యక్రియల ఏర్పాటులో సహకరించారు. అమె నిజంగానే చనిపోయినట్లు ప్రవర్తించారు.మరి.. ఇలాంటి ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.