ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్లు మహమ్మారిని ఎదుర్కోవడంలో సత్ఫలితాలిస్తున్నట్లు వాస్తవ నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా వైరస్బారిన పడి ప్రాణాలు కోల్పోయే ముప్పు నుంచి పూర్తి రక్షణ కల్పిస్తున్నాయనే వార్తలు మరింత రిలీఫ్ ఇస్తున్నాయి. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన ఆస్ట్రాజెనికా (కొవిషీల్డ్) కరోనా టీకాను సింగిల్ డోస్ వేసుకున్నా, వైరస్ తో చనిపోయే ప్రమాదం 80 శాతం వరకూ తగ్గుతుందని ‘పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (పీహెచ్ఈ)’ సంస్థ వెల్లడించింది. అలాగే ఫైజర్ బయో ఎన్ టెక్ టీకా సింగిల్ డోస్ తో 80 శాతం, రెండు డోస్ లతో 97 శాతం మరణించే ప్రమాదం తగ్గుతుందని కూడా తమ స్టడీల్లో తేలినట్లు ఆ సంస్థ ప్రకటించింది. గత డిసెంబర్, ఏప్రిల్ నెలల మధ్య కొత్త సింప్టమాటిక్ కేసులు, పాజిటివ్ వచ్చి, 28 రోజుల్లోపు చనిపోయినవారు, వ్యాక్సినేషన్ స్టేటస్ వంటివి స్టడీ చేయగా వచ్చిన ఫలితాలను బట్టి ఈ అంచనాలను రూపొందించినట్లు పీహెచ్ఈ తెలిపింది.
అలాగే 80 ఏళ్లకు పైబడిన వాళ్లు ఫైజర్ బయో ఎన్ టెక్ టీకా తీసుకుంటే హాస్పిటల్ లో చేరే ప్రమాదం 93% తక్కువగా ఉంటుందని తమ స్టడీలో తేలినట్లు వివరించింది. కరోనా సోకడానికి వారం రోజుల ముందు సెకండ్ డోస్ ఫైజర్ టీకా తీసుకున్నోళ్లకు కూడా మరణించే ప్రమాదం 69% తగ్గుతుందని వివరించింది. అయితే ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తీసుకుంటే మరణించే ప్రమాదం ఎంత తగ్గుతుందన్న కోణంలో ఇదే ఫస్ట్ స్టడీ అని పీహెచ్ఈ తెలిపింది. ఇక ఫైజర్ టీకా తొలిడోసుతోనే 80శాతం రక్షణ కల్పిస్తుండగా రెండు డోసులు తీసుకున్న వారిలో 97శాతం రక్షణ కల్పిస్తుందని పీహెచ్సీ అధ్యయనం వెల్లడించింది. 80ఏళ్లకు పైబడిన వృద్ధులు కొవిడ్తో ఆసుపత్రుల్లో చేరే ప్రమాదం దాదాపు 93శాతం తగ్గినట్లు పీఎచ్సీ జరిపిన పరిశోధన ఇంతకుముందే అంచనా వేసింది.