Viral Video: కొంతమంది కాసుల కోసం ఎంతటికైనా తెగిస్తున్నారు. ఎదుటి వ్యక్తి ప్రాణాలకు కొంచెం కూడా విలువ ఇవ్వడం లేదు. ప్రాణాల్ని పూచిక పుల్లతో సమానంగా చూస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా, డబ్బుల కోసం కక్కుర్తి పడి ఓ యువకుడ్ని సజీవ సమాధి చేశారు కొందరు వ్యక్తులు. జ్ఞానం లభిస్తుందని యువకుడ్ని నమ్మించి ఈ ఘోరానికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, ఉన్నావో జిల్లాలోని తాజ్పూర్కు చెందిన సుభం గోశ్వామికి దైవ భక్తి ఎక్కువ. పూజారులతో కలిసి తరచుగా పూజా కార్యక్రమాల్లో పాల్గొనేవాడు.
ఈ నేపథ్యంలోనే మున్నాలాల్, ముఖేష్ దీక్సిత్ అనే పూజారులు సుభంను వాడుకుని సొమ్ము చేసుకోవాలనుకున్నారు. నవరాత్రులు ఉండటంతో ‘భూ సమాధి’కి తెరతీశారు. సజీవ సమాధి అయితే జ్ఞానం లభిస్తుందని సుభాన్ని నమ్మించారు. దైవ భక్తి ఎక్కువగా ఉన్న సుభం వాళ్లు చెప్పింది గుడ్డిగా నమ్మాడు. సమాధిలోకి వెళ్లటానికి నిశ్చయించుకున్నాడు. ఆదివారం సాయంత్రానికి 6 అడుగుల సమాధి ఏర్పాటు చేయబడింది. సాయంత్రం సుభం ఆ సమాధిలోకి వెళ్లాడు. ఆ తర్వాత దాన్ని బొంగు కర్రలతో, మట్టితో కప్పేశారు.
ఈ సజీవ సమాధి విషయం ఊరు మొత్తం దావాలనంలా పాకిపోయింది. ఊరి ప్రజలు సమాధి విషయం తెలియగానే భయపడిపోయారు. వెంటనే దీనిగురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన గ్రామానికి చేరుకున్న పోలీసులు సుభాన్ని సమాధినుంచి బయటకు తీశారు. సమాధికి కారణమైన వారిపై కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సమాధిలోకి వెళ్లిన సుభం గోస్వామిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సుభంను పోలీసులు సమాధి నుంచి బయటకు తీసుకువస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
సజీవ సమాధిలోకి వెళ్లిన యువకుడు.. pic.twitter.com/zxeLzYFSh1
— venky bandaru (@venkybandaru13) September 27, 2022
ఇవి కూడా చదవండి : భర్తకి ప్రియురాలితో పెళ్లి చేసిన భార్య ఘటనలో షాకింగ్ ట్విస్ట్!