శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మధురలో మద్యం, మాంసం నిషేధిస్తున్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుక సందర్భంగా సీఎం యోగి ఈ నిర్ణయం తీసుకున్నారు. మద్యం, మాంసం అమ్మకాల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆగస్టు 30న ఆదేశాలు జారీ చేశారు.లక్నోలో జరిగిన కృష్ణోత్సవ్ 2021 కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. సందర్భంగా ప్రసంగించిన ఆయన మద్యం, మాంసం వ్యాపారం చేసే వారు తమ వ్యాపారాన్ని మార్చుకోవాలని అన్నారు.
హిందువులంతా మధురను శ్రీమహా విష్ణువు అవతారం అయిన శ్రీకృష్ణుడి జన్మస్థానంగా భావిస్తారు. నల్లనయ్యను ఆరాధిస్తారు. శ్రీమహావిష్ణువు జన్మించిన పవిత్ర స్థలంలో మద్యం, మాసాలు విక్రయించకూడదని సీఎం యోగీ ఆదిత్యానాథ్ నిర్ణయించారు. ఈ మేరకు మధురలో మద్యం, మాంసాలపై నిషేధాన్ని అమలు చేసేలా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
పాల ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచిన మధుర పూర్వ వైభవాన్ని పునరుద్ధరించడానికి వారంతా పాలు విక్రయించాలని సీఎం సూచించారు. ఇదే సమయంలో కరోనా మహమ్మారిని అంతమొందించాలంటూ శ్రీకృష్ణుడిని ఆయన ప్రార్థించారు.