ఫిల్మ్ డెస్క్- టాలీవుడ్ స్టార్ హీరోలు సూపర్ స్టార్ మహేశ్బాబు, మెగా హీరో రామ్ చరణ్ మంచి స్నేహితులని అందరికి తెలిసిందే. ఐతే వీళ్లిద్దరే కాదు వీళ్లిద్దరి సతీమణులు నమ్రతా శిరోద్కర్, ఉపాసన కూడా బెస్ట్ ఫ్రెండ్స్. సమయం చిక్కినప్పుడల్లా వీరిద్దరి కుటుంబాలు కలుస్తుంటాయి. ఎవరింట్లో ఏ శుభ కార్యం జరిగినా అంతా అటెండ్ అవుతుంటారు.
ప్రస్తుతం తమ తమ సినిమా ప్రాజెక్ట్ లలో మహేష్ బాబు, రామ్ చరణ్ బిజీగా ఉండటంతో, వాళ్ల సతీమణులిద్దరూ దుబాయ్లో పార్టీ చేసుకున్నారు. మహేశ్ బాబు భార్య నమ్రత శిరోద్కర్, రామ్చరణ్ భార్య ఉపాసన ఇద్దరూ దుబాయ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. దుబాయ్ ఎక్స్పో 2020లో భాగంగా వీళ్లిద్దరూ అక్కడికి వెళ్లి క్రిస్మస్ పండగను సెలబ్రేట్ చేసుకున్నారు.
ఉపాసన.. నమత్ర శిరోద్కర్, ఆమె సోదరి శిల్పా, మనీశ్ మల్హోత్రా తదితరులకు లంచ్ పార్టీ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోలను వారు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఇష్టమైనవారితో రుచికరమైన విందు.. ఈ మధ్యాహ్నాన్ని ఎంతో ఎంజాయ్ చేశాను.. ఉపాసన.. నీలా అద్భుతమైన వంటకాలతో విందును ఎవరూ ఇవ్వలేరు.. మనీశ్.. నిన్నిక్కడ చూడటం చాలా సంతోషంగా ఉంది.. అని నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో కామెంట్ చేసింది.
అంతే కాదు.. మనమంతా మరోసారి హైదరాబాద్లో ఇలాంటి పార్టీని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది.. అది కూడా త్వరలోనే.. అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది నమ్రత. దీనికి స్పందించిన ఉపాసన.. నిజంగా చాలా ఎంజాయ్ చేశాం.. లవ్లీ మీటింగ్.. త్వరలోనే హైదరాబాద్లో కూడా ప్లాన్ చేద్దాం.. అని రిప్లై ఇచ్చింది.