టోక్యో ఒలింపిక్స్ లో భారత మహిళలు తమ సత్తా చాటుతున్నారు. ఇప్పటి వరకు వివిధ విభాగాల్లో మహిళలు సత్తా చాటి మన మువ్వన్నెల జెండాని రెపరెపలాడించగా, ఇప్పుడు భారత మహిళల హాకీ జట్టు దేశం గర్వించే విజయాన్ని అందుకుంది. 3 సార్లు విజేత అయిన ఆస్ట్రేలియా జట్టుని క్వార్టర్ ఫైనల్స్లో ఓడించి ఇండియా దర్జాగా సెమీ ఫైనల్స్లోకి అడుగు పెట్టింది. దీంతో.., ఇంకొక్క విజయం సాధిస్తే.. టోక్యో ఒలింపిక్స్లో భారత మహిళల హాకీ జట్టుకి పతకం ఖాయం అవుతుంది.
గ్రూప్ దశలో సాధించిన వరుస విజయాల దూకుడును క్వార్టర్ ఫైనల్స్ కూడా కొనసాగించారు మన విమెన్ హాకీ ప్లేయర్స్. ఎక్కడా పొరపాట్లకు అవకాశం లేకుండా ప్రత్యర్థి జట్టుని ముప్పతిప్పలు పెట్టారు. నిజానికి తొలి రెండు క్వార్టర్లు ముగిసే సమయానికి ఒక్క జట్టు కూడా గోల్ చేయలేదు. అయితే.., మూడో క్వార్టర్ 22వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ లభించగా.. గుర్జీత్ కౌర్ దాన్ని గోల్ గా మలిచింది. ఇక ఇక్కడ నుండి మ్యాచ్ ని కాపాడింది మాత్రం గోల్ కీపర్ సవిత అని చెప్పుకోవచ్చు.
మూడో క్వార్టర్ లో ఇండియా గోల్ చేశాక ఆస్ట్రేలియాకి మొత్తం ఎనిమిది పెనాల్టీ కార్నర్లు లభించాయి. కానీ..,అవేవి గోల్ గా పోకుండా కాపాడింది మన గోల్ కీపర్ సవిత. ఈమె దాటికి ఆస్ట్రేలియా విమెన్ హాకీ ప్లేయర్స్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. ఒక్క సవిత మాత్రమే కాదు.., కెప్టెన్ రాణి, గుర్జీత్ కౌర్, దీప్ గ్రేస్ ఎక్కా, ఉదిత, నిషా, నేహా, మోనికా, నవ్జోత్ కౌర్, నవ్నీత్ కౌర్, వందన కఠారియా ఒక్కొక్కరు ఒక్కో చిరుత పులిలా ఈ మ్యాచ్ లో పోరాడారు. తదుపరి మ్యాచ్ లలో కూడా మన విమెన్ హాకీ ప్లేయర్స్ ఇదే స్ఫూర్తితో ముందుకి వెళ్తే ఓ అద్భుతం మన కళ్ళ ముందు ప్రత్యక్షం కావడం పేద కష్టం కాకపోవచ్చు. సో.. మీరు కూడా మన విమెన్ హాకీ జట్టుకి కామెంట్స్ రూపంలో బెస్ట్ విషెస్ తెలియచేయండి.