విజయవాడలో తీవ్ర విషాదం నెలకొంది. దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చిన తెలంగాణకు చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇద్దరు సత్రంలో విషం తాగి ఆత్మహత్య చేసుకోగా.. మరో ఇద్దరు కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
మృతులు నిజామాద్ కు చెందిన వారిగా గుర్తింపు. ఈ నెల 6న వీరు విజయవాడకు వచ్చినట్లు తెలుస్తోంది. విజయవాడ వన్ టౌన్ లోని విశ్వబ్రాహ్మణ సత్రంలో బస చేసినట్లు సమాచారం. అక్కడ పప్పుల అఖిల్ పేరుతో రూమ్ అద్దెకు తీసుకున్నారు. అప్పుల బాధతోనే వీరు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. వీరు చనిపోయే ముందు బంధువులకు మెసేజ్ చేసినట్లు సమాచారం. మృతదేహాలను దుర్గా ఘాట్ లో ఉంచారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని సమాచారం ప్రారంభించారు.