అమరావతి– ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీలో విషాదం నెలకొంది. కృష్టా జిల్లా టీడీపీ సీనియర్ నేత కాట్రగడ్డ బాబు కన్నుమూశారు. మధ్యాహ్నం గుండె నొప్పి రావడంతో కాట్రగడ్డ బాబును ప్రయివేట్ ఆసుపత్రి లో చేర్పించారు. వైద్యులు ఆయనకు వైద్యం చేస్తుండగా, సాయంత్రం కార్డియాక్ అరెస్ట్ తో తుది శ్వాస విడిచారు.
కాట్రగడ్డ బాబు గత 25 సంవత్సరాలుగా విజయవాడ నగరంలో పార్టీలో వివిధ పదవుల్లో కొనసాగారు. దశాబ్ద కాలంగా పేదలకు ఉచిత మందుల పంపిణీ, క్లిన్ అండ్ గ్రీన్ వంటి సేవ కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు ఆయన నిత్యం అందుబాటులో వుండేవారు. కాట్రగడ్డ బాబు మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నేతలు సంతాపం తెలిపారు.
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి లోకేష్ తో సహా పలువురు టీడీపీ నేతలు కాట్రగడ్డ బాబు మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కాట్రగడ్డ బాబు కుటుంబానికి తమ ప్రగాడ సానుభూతి తెలిపారు. పార్టీకి, ప్రజలకు కాట్రగడ్డ బాబు చేసిన సేవలను ఈ సందర్బంగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
కాట్రగడ్డ బాబు ఆకాల మరణంతో తెలగుదేశం పార్టీలో విషాద ఛాయలు అలముకున్నాయి. పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు కాట్రగడ్డ బాబు బౌతికఖాయాన్ని సందర్శించి నివాలులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతున్ని ప్రార్ధించారు.