తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు..రాష్ట్రంలో ఎంతటి రాజకీయ వేడిని రాజేశాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 4 లక్షల మంది విద్యార్థులు పరీక్షకి హాజరు కాగా, వీరిలో కేవలం 49 శాతం మంది మాత్రమే పాస్ అయ్యారు. మిగతా 51 శాతం మంది విద్యార్థులు ఫెయిల్ కావడంతో విద్యార్థి తల్లితండ్రులు, విపక్షాలు ఇందుకు ఇంటర్ బోర్డు బాధ్యత వహించాలంటూ ఇన్ని రోజులు ధర్నాలు చేస్తూ వచ్చారు.
కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలకి సైతం పాలపడ్డారు. ఈ నేపధ్యంలోనే తాజాగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిల్ అయిన విద్యార్థులు అందరిని మినిమమ్ మార్క్స్ తో పాస్ చేస్తున్నట్టు తెలంగాణ విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ప్రకటించారు. మరి.. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.