హైదరాబాద్ :అమీర్ పేటలోని ఆదిత్య పార్క్ ప్రమోనేడ్ -మల్టీ కుజైన్ రెస్టారెంట్ లో తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక మైన తెలంగాణా రుచులతో కూడిన ఫుడ్ ఫెస్టివల్ ను ఏర్పాటు చేశారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ జూన్3 తేదీ నుంచి జూన్ 9తేదీ వరకూ రోజు మధ్యాహ్న భోజన వేళలలో 12.30 గంటల నుంచి 3గంటల వరకూ, రాత్రి డిన్నర్ సమయంలో 7.30 గంటల నుంచి10 గంటల వరకూ ఈ తెలంగాణా ఫుడ్ ఫెస్టివల్ లో అందించే రుచులు భోజన ప్రియులను అలరించనున్నాయి.తెలంగాణా గ్రామీణ ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన వంటకాలతో తయారు చేసిన మెనూ ను పట్టణవాసులు ఎంతో బాగా ఎంజాయ్ చేస్తారు. మాస్టర్ ఛెఫ్ వెంకటేష్ తెలంగాణాలో ఫెమస్ వంటకాలను అందిస్తున్నారు.
వారం రోజుల పాటూ జరిగే ఈ ఫుడ్ ఫెస్టివల్లో నాన్ వెజిటేరియన్స్ కోసం నాటు కోడి కూర, తుంటి కూర బోటి, తలకాయ కూర, యాట కూర వంటి వాటిని పలావ్ తో కలిపి వడ్డించనున్నారు. వెజిటేరియన్ల కోసం బచ్చల కూర, వంకాయ పులుసు, పుంటికూర చన్నాదాల్, పప్పుచారు, పచ్చి పులుసు వంటి వంటకాలు అందుబాటులో ఉండనున్నాయి. పాశం, గరిజెలు, రవ్వ లడ్డు, బక్షాలు, గవాలు, చక్కెర పొంగల్ వంటి డెజర్ట్స్ తో పాటూ పలు రకాల కేకులు,పేస్ట్రాలు కూడా ఉంటాయి. ఈ సందర్భంగా హోటల్ ఆదిత్య పార్క్ మేనేజర్ రాజా మాట్లాడుతూ ఈ ఫుడ్ ఫెస్టివల్ ద్వారా తెలంగాణ ట్రెడిషన్ కు తగినట్లు ప్రత్యేకత కలిగిన వంటకాలను అందిస్తామన్నారు. ఈ ప్రత్యేకమైన బఫెట్ సందర్భంగా రెస్టారెంట్ ను ఉత్సాహవంతమైన తెలంగాణా ప్రాంతపు వాతావరణాన్ని గుర్తుకు తెచ్చేలా అలంకరించడం జరిగిందని చెప్పారు. ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్స్ ను నిర్వహించడం ద్వారా తమ వద్దకు వచ్చే అతిధులకు సరికొత్త రుచులను అందంచాలనే ఆదిత్య పార్క్ లక్ష్యం అన్నారు.