Suman TV: సమాజంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరుగుతున్న రోజులివి. చిన్నాపెద్దా అనే తేడాలేకుండా స్త్రీలపై జరుగుతున్న అన్యాయాలు చూస్తున్నాం. ముఖ్యంగా ఒంటరిగా బయటికి వెళ్లిన ఆడపిల్ల ఇంటికి క్షేమంగా వస్తుందని గ్యారంటీ లేని రోజులివి. అలాంటిది మాటలురాని(మూగ) పదహారేళ్ళ అమ్మాయి, తనని తాను రక్షించుకునే మానసిక స్థితి లేని అమ్మాయి.. సమాజంలో తప్పిపోతే ఏంటి పరిస్థితి? ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మాయి బయటికి వెళ్తేనే.. తిరిగొచ్చే వరకూ టెన్షన్ పడుతున్నారు తల్లిదండ్రులు. అలాంటిది ఆ అమ్మాయి మూగ అయ్యుంటే.. ఆ పేరెంట్స్ పడే క్షోభను ఎవరూ తీర్చలేరు.
ఈ నెల 19న అంటే గత ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో.. మణికొండ ఏరియాలోని పుప్పాలగూడకు చెందిన పదహారేళ్ళ మూగ అమ్మాయి ఎల్. లక్ష్మీ తప్పిపోయిన ఘటన గురించి తెలిసిందే. అప్పటినుండి లక్ష్మి కోసం తల్లిదండ్రులతో పాటు ఇరుగుపొరుగు వాళ్లంతా వెతకడం ప్రారంభించారు. చుట్టుపక్కల ఎక్కడా లక్ష్మీ ఆచూకీ లేని సమయంలో సుమన్ టీవీ యాజమాన్యం.. పుప్పాలగూడ ఏరియాకు చేరుకొని.. లక్ష్మి తల్లిదండ్రులు, ఇరుగుపొరుగు వాళ్ళను కనుక్కొని.. ‘లక్ష్మి కనబడుట లేదు’ అని వీడియో చేశారు. సుమన్ టీవీ వీడియో చేసిన మూడు రోజులకు సుమన్ టీవీ ప్రేక్షకుల ద్వారా.. అమ్మాయి ఆచూకీ ఆమె తల్లిదండ్రులకు అందింది.
లక్ష్మి కనిపించకుండా పోయిన రోజునుండి బాధతో.. ఎంతో కుములిపోయి ఏడ్చిన కుటుంబీకులు.. ప్రస్తుతం లక్ష్మి ఇంటికి తిరిగిరావడంతో పట్టలేని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. సుమన్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. అయితే.. ఇదంతా సుమన్ టీవీ కృషితో పాటు సుమన్ టీవీ ప్రేక్షకుల సహకారం వల్లే సాధ్యమైంది. సుమన్ టీవీకి ప్రేక్షకుల ఆదరణ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుతుకుంటుంది. మున్ముందు ఇలాంటి సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేసేందుకు కృషి చేస్తుందని తెలుపుకుంటోంది. మరి తప్పిపోయిన తల్లి బిడ్డను కలిపిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.