దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా కొనసాగుతోంది. మరోవైపు ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే.
ఈ అంశంపై పలు హై కోర్టులు కేంద్ర ఎన్నికల కమిషన్ పై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రజల ప్రాణాల కన్నా ఎన్నికలు ముఖ్యమా అని అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా వచ్చే ఏడాది జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయమని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి : ఆవు మాకు పవిత్రం.. వాళ్లకు మాత్రం పాపం! మోదీ సంచలన వ్యాఖ్యలు
ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ మంత్రి సుబ్రహ్మణ్యస్వామి చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఒమిక్రాన్ వ్యాప్తి ఇలానే కొనసాగితే.. ఎన్నికలను వాయిదా వేయడమే కాక.. లాక్ డౌన్ విధించే అవకాశం ఉందంటూ ట్వీట్ చేశారు. ‘ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ విధించడమే కాక.. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను సెప్టెంబర్ వరకు వాయిదా వేసి.. రాష్ట్రపతి పాలన విధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ సంవత్సరం ప్రారంభంలో నేరుగా చేయలేనిది వచ్చే ఏడాది ప్రారంభంలో పరోక్షంగా చేయవచ్చు” అంటూ సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేశారు.
Don’t be surprised by a Lockdown for Omicron and postponement of UP elections to September under President Rule in UP. What could not directly be done earlier this year can be then done indirectly early next year
— Subramanian Swamy (@Swamy39) December 23, 2021
ఇది కూడా చదవండి : నీట్ గా ప్యాక్ చేసి.. అల్మరాలో దాచి