శ్రీశైలం- భక్తులు పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నేపధ్యంలో డబ్బు, బంగారం, వెండి రూపంలో తమ ఇష్టదైవానికి కానుకలు ఇస్తారు. తిరుమల తిరుపతిలో ఐతే ప్రతి రోడు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కిస్తుంటారు. ఐతే చాలా వరకు ఆలయాల్లో నెలకొసారి హుండీ ఆదాయాన్ని లెక్కిస్తారు.
ఇదిగో ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయ హుండీని లెక్కించారు. శ్రీశైలం ఆలయానికి మొట్ట మొదటిసారి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది. 30 రోజుల్లో 5,02,45,459 నగదు, 459 గ్రాముల బంగారం, 14 కిలోల వెండిని భక్తులు స్వామి, అమ్మవార్లకు కానుకల రూపంలో సమర్పించారు. శ్రీశైల మల్లికార్జునుడి హుండీ ఆదాయం ఇంత మొత్తంలో రావడం ఇదే మొదటిసారని ఆలయ అధికారులు చెప్పారు.
ఈ సంవత్సరం 2021 జనవరి, చివరి నెల డిసెంబర్ లో అత్యధికంగా హుండీ ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో కూడా స్వామి వారి హుండీ ఆదాయం భారీగానే వచ్చింది. భక్తులు కానుకల రూపంలో నగదుతో పాటు బంగారు, వెండి ఆభరణాలు కూడా సమర్పించారు. ఈ ఏడాది జనవరిలో 3.82 కోట్లకు పైగా హుండీ ఆదాయం వచ్చింది. మొత్తం 35 రోజులకు గాను 3,82,23,900 భక్తుల కానుకల రూపంలో సమర్పించారు.
బంగారం 153.900 గ్రాములు, వెండి 4.700 కేజీలు, 200 యూఎస్ డాలర్స్, 156 యూఏఈ ధిరమ్స్, 15 యూరోలు, ఐదు కెనడా డాలర్లు వచ్చాయని అధికారులు పేర్కొన్నారు. ఇదిగో ఇప్పుడు మళ్లీ డిసెంబర్ లో 5,02,45,459 నగదు, 459 గ్రాముల బంగారం, 14 కిలోల వెండిని స్వామి, అమ్మవార్లకు భక్తులు సమర్పించారు.